‘ఒక దేశం.. ఒక రేషన్‌ కార్డు’ సాధ్యాసాధ్యాలు పరిశీలించండి

లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పేదలు, వలస కార్మికులను ఆదుకునేందుకు వీలుగా తాత్కాలికంగా ‘ఒక దేశం.. ఒక రేషన్‌ కార్డు’ పథకం అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. వలస కార్మికుల హక్కుల పరిరక్షణకు సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాలంటూ ఇటీవల న్యాయవాది దీపక్‌ కన్సాల్‌ ఈ మేరకు పిటిషన్‌ దాఖలు చేశారు....

Published : 28 Apr 2020 22:00 IST

కేంద్రానికి సుప్రీం కోర్టు సూచన

న్యూదిల్లీ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పేదలు, వలస కార్మికులను ఆదుకునేందుకు వీలుగా తాత్కాలికంగా ‘ఒక దేశం.. ఒక రేషన్‌ కార్డు’ పథకం అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని మంగళవారం పేర్కొంది. వలస కార్మికుల హక్కుల పరిరక్షణలో సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాలంటూ ఇటీవల న్యాయవాది దీపక్‌ కన్సాల్‌ ఈ మేరకు పిటిషన్‌ దాఖలు చేశారు. జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై వాదనలు విన్నది. పథకాల అమలు, ఆహార ధాన్యాల పంపిణీలో ఆయా రాష్ట్రాలు స్థానికులకే ప్రాధాన్యం ఇస్తున్నాయని.. దీంతో వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని న్యాయవాది పిటిషన్‌లో ఆరోపించారు. లాక్‌డౌన్‌కు ముందు కేంద్రం ఈ ఏడాది జూన్‌నుంచి ఈ పథకం ప్రారంభించేందుకు సన్నాహాలు చేసినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు