‘ఒక దేశం.. ఒక రేషన్ కార్డు’ సాధ్యాసాధ్యాలు పరిశీలించండి
లాక్డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పేదలు, వలస కార్మికులను ఆదుకునేందుకు వీలుగా తాత్కాలికంగా ‘ఒక దేశం.. ఒక రేషన్ కార్డు’ పథకం అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. వలస కార్మికుల హక్కుల పరిరక్షణకు సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాలంటూ ఇటీవల న్యాయవాది దీపక్ కన్సాల్ ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు....
కేంద్రానికి సుప్రీం కోర్టు సూచన
న్యూదిల్లీ: లాక్డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పేదలు, వలస కార్మికులను ఆదుకునేందుకు వీలుగా తాత్కాలికంగా ‘ఒక దేశం.. ఒక రేషన్ కార్డు’ పథకం అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని మంగళవారం పేర్కొంది. వలస కార్మికుల హక్కుల పరిరక్షణలో సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాలంటూ ఇటీవల న్యాయవాది దీపక్ కన్సాల్ ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ బీఆర్ గవాయ్లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై వాదనలు విన్నది. పథకాల అమలు, ఆహార ధాన్యాల పంపిణీలో ఆయా రాష్ట్రాలు స్థానికులకే ప్రాధాన్యం ఇస్తున్నాయని.. దీంతో వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని న్యాయవాది పిటిషన్లో ఆరోపించారు. లాక్డౌన్కు ముందు కేంద్రం ఈ ఏడాది జూన్నుంచి ఈ పథకం ప్రారంభించేందుకు సన్నాహాలు చేసినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
భక్తులంతా వేయికళ్లతో ఎదురుచూసిన సింహాద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శనం సాక్షాత్కారమైంది. వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలంలో చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
సినీ నటుడు చిరంజీవి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నాటి జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
-
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
-
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..