జాగ్రత్త:భారత్లో సమూహ వ్యాప్తి ముప్పు?
భారత్లో కరోనా వైరస్ సమూహ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. లాక్డౌన్ ఆంక్షలు క్రమంగా సడలిస్తే ముప్పు పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. కొందరైతే ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వైరస్ మూడో దశలో ఉందని భావిస్తున్నారని భారత ప్రజారోగ్య స్వచ్ఛంద సంస్థ....
ముంబయి: భారత్లో కరోనా వైరస్ సమూహ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. లాక్డౌన్ ఆంక్షలు క్రమంగా సడలిస్తే ముప్పు పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. కొందరైతే ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వైరస్ మూడో దశలో ఉందని భావిస్తున్నారని భారత ప్రజారోగ్య స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు ప్రొఫెసర్, డాక్టర్ కె.శ్రీనాథరెడ్డి అంటున్నారు. హార్వర్డ్, సిడ్నీ మెడికల్ యూనివర్సిటీ, ఎయిమ్స్ మరికొన్ని చోట్ల ఆయన పనిచేశారు.
కేసులను గమనిస్తే ప్రయాణాలకు సంబంధంలేనివి కనిపిస్తున్నాయని శ్రీనాథరెడ్డి అన్నారు. ప్రభుత్వాలు చాలావరకు విదేశాల నుంచి తిరిగొచ్చిన వారిపైనే దృష్టిపెట్టాయని వెల్లడించారు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి రెండో దశలో ఉందంటున్న వారు స్థానిక వ్యాప్తిని గుర్తించగలుగుతున్నామని చెబుతున్నారన్నారు. అందుకే సమూహ వ్యాప్తి అనే పదం ఉపయోగించడం లేదని తెలిపారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న పదజాలంపై చర్చించాల్సిన అవసరం ఉందనీ ఆయన పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ భారత్కు సమూహవ్యాప్తి ముప్పు పొంచిఉందని ఆయన హెచ్చరించారు.
ఇతర దేశాలతో పోలిస్తే భారత్, మలేసియా సహా నైరుతి ఆసియా దేశాలు కొవిడ్-19 మరణాల రేటును తగ్గించగలిగాయని శ్రీనాథ్ పేర్కొన్నారు. ఎక్కువ యువత, గ్రామీణ జనాభా, ఉష్ణోగ్రత, వాతావరణం, వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు, లాక్డౌన్ వంటి చర్యలతో తక్కువ మరణాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. సంబంధిత చర్యల ప్రయోజనం కనిపించిందని ఆయన పేర్కొన్నారు. వీటి నుంచి ఇంకా ఫలాలు పొందాల్సి ఉందన్నారు. ఆంక్షలు సడలించినా వైరస్ వ్యాప్తి చెందకుండా భౌతిక దూరం, మాస్క్లు, చేతులు శుభ్రం చేసుకోవడం కొనసాగించాలని సూచించారు.
జన సమూహ ప్రదేశాలు, మురికివాడలు, తాత్కాలిక నివాస కేంద్రాల వద్ద కఠిన జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీనాథరెడ్డి అన్నారు. అదృష్టవశాత్తూ పెద్ద నగరాల్లోనే వైరస్ వ్యాప్తి ఉందని పేర్కొన్నారు. వలస కార్మికులు వైరస్ బాధితులు కాకుండా చూసుకోవాలన్నారు. ఎక్కువ మంది జీవిస్తున్న గ్రామీణ భారతాన్ని రక్షించుకోవాలని సూచించారు. వైరస్ కొంతకాలం వరకు ఉంటుందని గుర్తించి జాగ్రత్తలు పాటించాలని కోరారు. ప్రజలు భౌతిక దూరం పాటించినప్పుడే వైరస్ తీవ్రత తగ్గుతుందని చరిత్ర చెబుతోందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!