నాసా చెప్పినా..ఇవాంక వినలేదు
2011 తరవాత అమెరికాలో స్పేస్ఎక్స్ నిర్వహించ తలపెట్టిన మానవ సహిత అంతరిక్ష యాత్రకు కుటుంబ సభ్యులతో కలిసి ఇవాంక ట్రంప్ హాజరయ్యారు.
వైరస్ మీ దరిచేరదా? అంటూ నెటిజన్ల విమర్శలు
వాషింగ్టన్: 2011 తరవాత అమెరికాలో స్పేస్ఎక్స్ నిర్వహించ తలపెట్టిన మానవ సహిత అంతరిక్ష యాత్ర కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా అధ్యక్షుని కుమార్తె ఇవాంక ట్రంప్ హాజరయ్యారు. కరోనా మహమ్మారి కారణంగా ఆ కార్యక్రమాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఇంటి నుంచి వీక్షించమని ప్రజలందరికి సూచించినప్పటికీ ఆమె మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ఆ మిషన్ను వీక్షించడానికి ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్కు వెళ్లారు. వారి పర్యటనకు సంబంధించిన చిత్రాలను ఆమె భర్త జేర్డ్ కుష్నర్ ట్విటర్లో షేర్ చేశారు. అందులో ఆయన కనీసం మాస్క్ కూడా ధరించలేదు. దీనిపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు. వారి కుటుంబానికి కరోనా వైరస్ను తట్టుకొనే రోగ నిరోధక శక్తి ఉందా? అని ప్రశ్నించారు. దీని ద్వారా వారు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారని మరో నెటిజన్ కామెంట్ చేశారు. కరోనా వైరస్ సృష్టించిన విలయతాండవానికి ఇప్పటివరకు ఎక్కువ బలైంది అమెరికా దేశ వాసులే. ఆ దేశంలో మరణాల సంఖ్య లక్షమార్కును కూడా దాటేసింది.
ఇదిలా ఉండగా, వాతావరణం అనుకూలించకపోవడంతో లాంచింగ్కు 17 నిమిషాల ముందు అంతరిక్ష యాత్రను వాయిదా వేశారు. మే 30, మే 31.. ఈ రెండు తేదీలలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మిషన్ ప్రయోగం వాయిదా పడటంతో ఇవాంక ట్విటర్ వేదికగా నిరుత్సాహాన్ని వ్యక్తం చేశారు. అయితే అన్నింటికంటే భద్రతే ముఖ్యమని అన్నారు.
ఇవీ చదవండి:
సోషల్ మీడియా సంస్థలకు ట్రంప్ హెచ్చరిక!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ