ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఎనిమిది మంది భార్యలు.. ఒకే ఇంట్లో కాపురం
అతడో సామాన్యుడు. ఎనిమిది మందిని పెళ్లి చేసుకున్నాడు. అంతకుముందు చేసుకున్న భార్యలను ఒప్పించి మరీ వివాహమాడాడు. ..
అతడో సామాన్యుడు. ఎనిమిది మందిని పెళ్లి చేసుకున్నాడు. అంతకుముందు చేసుకున్న భార్యలను ఒప్పించి మరీ వివాహమాడాడు. ఆ ఎనిమిది పెళ్లిళ్లు కూడా ప్రేమ తంతులే. ఒక్కో గదిలో ఇద్దరు భార్యల చొప్పున.. ఎనిమిది మందితో కాపురం చేస్తున్న అతడే థాయ్లాండ్కు చెందిన ఓంగ్ డామ్ సోరోట్. థాయ్లాండ్లో ఫేమస్ అయిన టాటూ ఆర్టిస్ట్ ఓంగ్ సోరోట్, అతడి భార్యలను ఓ థాయ్ కమెడియన్ ఇంటర్వ్యూ చేశాడు. అందులో తన ప్రేమలు, పెళ్లిళ్లపై ఆసక్తికర విషయాలను వెల్లడించాడు ఓంగ్. తమది ఎంతో అన్యోన్య దాంపత్యమని చెప్పుకొచ్చాడు. తన భార్యలు తనపై ఎంతో ప్రేమను కనబరుస్తారని అంటున్నాడు. మొదటి భార్యను స్నేహితుడి పెళ్లిలో, రెండో భార్యను మార్కెట్లో, మూడో భార్యను హాస్పిటల్లో.. నాలుగు, అయిదు, ఆరో భార్యలను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టిక్టాక్లలో, ఏడో భార్యను ఆలయంలో చూసి మనసు పారేసుకొని వారిని ఒప్పించి మనువాడాడు. ఓసారి నలుగురు భార్యలతో కలిసి విహారయాత్రకు వెళ్లినప్పుడు.. తన ఎనిమిదో భార్యను చూసి ఇష్టపడి అక్కడే పెళ్లిచేసుకొని.. ఇంటికి తీసుకొచ్చాడు. ఓంగ్ ఇంట్లో నాలుగు పడక గదులు ఉన్నాయి. ఒక్కో గదిలో ఇద్దరు భార్యల చొప్పున కాపురం చేస్తున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!