Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. 23 కంపార్టుమెంట్లలో భక్తులు

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కరోనా తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు

Published : 19 May 2022 07:20 IST

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కరోనా తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఇటీవల భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 23 కంపార్టుమెంట్లతో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 74,389 మంది భక్తులు దర్శించుకోగా.. 38,007 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.35 కోట్లుగా నమోదైనట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని