Hyderabad-Vijayawada: చౌటుప్పల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు వాహనదారుల అవస్థలు

విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారి(NH 65)పై వాహనదారులు అవస్థలు పడుతున్నారు. రహదారి విస్తవరణ పనుల వల్ల వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.

Published : 03 Sep 2023 21:16 IST

హైదరాబాద్‌: విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారి(NH 65)పై వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఎల్బీనగర్‌ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా దండుమల్కాపూర్‌ వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. దీంతో మల్కాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు భారీగా వాహనాల రద్దీ ఏర్పడింది. తూప్రాన్‌ నుంచి కొత్తగూడెం వరకు వాహనాలు నిలిచిపోయాయి. చౌటుప్పల్‌లోనూ హైదారాబాద్‌ వైపు వాహనాలు స్తంభించాయి. రహదారి విస్తవరణ పనుల వల్ల వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రహదారి విస్తరణ పనులతో పాటు, వారాంతం, ఇవాళ వివాహాలు ఎక్కువగా ఉండటం, రాఖీ పండుగకు వెళ్లి తిరుగు పయనం అవుతున్న వారితో రద్దీ మరింత పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని