TS High Court: గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు సబబే: హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు
టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ కేసులో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తెలంగాణ హైకోర్టు సమర్థించింది.
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ కేసులో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తెలంగాణ హైకోర్టు సమర్థించింది. ప్రిలిమ్స్ పరీక్ష రద్దు సబబేనని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ మళ్లీ నిర్వహించాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ టీఎస్పీఎస్సీ చేసిన అప్పీల్ను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది.
గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసి.. మళ్లీ నిర్వహించాలని హైకోర్టులో పలువురు అభ్యర్థులు పిటిషన్లు వేశారు. పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని పేర్కొన్నారు. హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని అభ్యర్థులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అభ్యర్థుల పిటిషన్లను పరిగణనలోకి తీసుకుని హైకోర్టు సింగిల్ జడ్జి విచారణ చేపట్టారు. ప్రిలిమ్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశించారు. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ టీఎస్పీఎస్సీ హైకోర్టు డివిజన్ బెంచ్లో అప్పీల్ చేసింది.
మీ నిబంధనలను మీరే ఉల్లంఘిస్తారా?
అప్పీల్పై మంగళవారం విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్.. టీఎస్పీఎస్సీపై ప్రశ్నల వర్షం కురిపించింది. ‘‘ప్రశ్న పత్రాల లీకేజీతో ఒకసారి గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహిస్తున్నపుడూ మళ్లీ అదే నిర్లక్ష్యమా? గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోరా? బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొని దాన్ని ఎందుకు అమలు చేయలేదు? మీ నోటిఫికేషన్లోని నిబంధనలను మీరే ఉల్లంఘిస్తారా? అలా ఎందుకు జరిగింది? లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. వారి ఆశలను నీరుగారుస్తారా’’ అని టీఎస్పీఎస్సీని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని.. వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించింది. అనంతరం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఎమ్మార్ కేసులో తీర్పు
11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఎమ్మార్ కేసులో డిశ్చార్జి పిటిషన్లపై సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించింది. -
వివేకా హత్య తర్వాత అవినాష్.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారు?: సునీత
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత ఆధారాలను చెరిపేసిన ఎంపీ అవినాష్రెడ్డి.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారని వైఎస్ సునీత ప్రశ్నించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
బ్యాంకాక్ ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి మూడు టైటిల్స్ కైవసం
బ్యాంకాక్లో జరిగిన ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి డాక్టర్ వై.మమతా చౌదరి మూడు టైటిల్స్ కైవసం చేసుకున్నారు. -
రైళ్లలో చోరీలకు పాల్పడే ముఠా అరెస్టు
రైళ్లలో బంగారు ఆభరణాల చోరీకి పాల్పడుతున్న ముగ్గురు ముఠా సభ్యులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
వరుణుడి అడ్డంకి.. బంగ్లాదేశ్పై భారత్ విజయం
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఎమ్మార్ కేసులో తీర్పు
-
ఇదే మా రిలేషన్షిప్ సీక్రెట్: జ్యోతిక
-
‘ఆ వీడియోలు నేనే ఇచ్చా’.. ప్రజ్వల్ మాజీ డ్రైవర్