మళ్లీ అదే నిర్లక్ష్యమా?
‘‘ప్రశ్న పత్రాల లీకేజీతో ఒకసారి గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహిస్తున్నపుడూ మళ్లీ అదే నిర్లక్ష్యమా? గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోరా?
తప్పులు సరిదిద్దుకోరా?
మీ నిబంధనలను మీరే ఉల్లంఘిస్తారా?
గత అక్టోబరులో రద్దయిన గ్రూప్-1 పరీక్షకు ఎంత మంది హాజరయ్యారు?
వివరాలు సమర్పించాలంటూ టీఎస్పీఎస్సీకి హైకోర్టు ఆదేశం
విచారణ నేటికి వాయిదా
ఈనాడు, హైదరాబాద్: ‘‘ప్రశ్న పత్రాల లీకేజీతో ఒకసారి గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహిస్తున్నపుడూ మళ్లీ అదే నిర్లక్ష్యమా? గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోరా? బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొని దాన్ని ఎందుకు అమలు చేయలేదు? మీ నోటిఫికేషన్లోని నిబంధనలను మీరే ఉల్లంఘిస్తారా? అలా ఎందుకు జరిగింది? లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. వారి ఆశలను నీరుగారుస్తారా’’ అని టీఎస్పీఎస్సీపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై కమిషన్ దాఖలు చేసిన అప్పీలుపై మంగళవారం జస్టిస్ అభినంద్కుమార్ షావిలి, జస్టిస్ జె.అనిల్కుమార్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. గత అక్టోబరులో ఎంత మంది ఈ పరీక్ష రాశారో, ఎన్ని కేంద్రాల్లో బయోమెట్రిక్ అమలు చేశారో... తాజాగా ఎందుకు అమలు చేయలేకపోయారో వివరాలు సమర్పించాలని టీఎస్పీఎస్సీని ఆదేశిస్తూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. గతంలో ఏయే పరీక్షల్లో బయోమెట్రిక్ అమలు చేశారో వివరాలు సమర్పించాలని పిటిషనర్లను ఆదేశించింది.
అభ్యర్థుల విశ్వాసం దెబ్బతీసిన కమిషన్
‘‘మొదట ప్రశ్నపత్రం లీకేజీ నుంచి ఎన్నో వివాదాలు వస్తూనే ఉన్నాయి. ఒకసారి సమస్య ఎదురయ్యాక రెండోసారి పరీక్ష నిర్వహించినపుడు మళ్లీ అవి జరగకుండా చూసుకోవాలి. మీరేం దాతృత్వ కార్యక్రమం నిర్వహించడంలేదు. అది మీ బాధ్యత. ఒకరి బదులు మరొకరు పరీక్ష రాస్తే ఏం చేస్తారు? ఇలాంటివి జరగకుండా రక్షణ కోసమే బయోమెట్రిక్. పరీక్ష పారదర్శకంగా నిర్వహించినట్లు అభ్యర్థులకు విశ్వాసం కల్పించాలి. కమిషన్ దాన్ని దెబ్బతీసింది. ఇది ప్రభుత్వ ప్రతిష్ఠకు చెందిన అంశం. కమిషన్ చర్యలను వెనకేసుకురావద్దు’’ అని అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ను ఉద్దేశించి న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ కేవలం ఊహలు, ఆరోపణలతో పిటిషన్ దాఖలు చేశారన్నారు. ఎలాంటి ఆధారాలు లేవన్నారు. కేవలం ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పిటిషన్ దాఖలు చేశారన్నారు. యుపీఎస్సీ పరీక్షల్లో కూడా బయోమెట్రిక్ లేదనగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ‘మీరెందుకు అమలు చేయలేద’ని ప్రశ్నించింది.
నోటిఫికేషన్ను మార్చడానికి వీల్లేదు
‘‘బయోమెట్రిక్ విధానం గురించి నోటిఫికేషన్లోని సూచనల్లో ఉంది. నోటిఫికేషన్ను మార్చడానికి వీల్లేదు. దీనికి సంబంధించి పలు తీర్పులున్నాయి. పిటిషన్ వేసింది ముగ్గురన్న విషయాన్ని పక్కనబెట్టండి. మొత్తం 503 పోస్టుల భర్తీలో 100 మంది తప్పుడు మార్గాల్లో ప్రవేశించినా పరీక్షల నిర్వహణ లక్ష్యం దెబ్బతిన్నట్టే. విశ్వసనీయత అవసరం. అందులో భాగమే ఈ బయోమెట్రిక్ విధానం. సాంకేతిక కారణాలతో అమలుచేయలేకపోతే, అదే విషయాన్ని పత్రికా ప్రకటన ద్వారా ఎందుకు తెలియజేయరాదు’’ అని హైకోర్టు టీఎస్పీఎస్సీని ప్రశ్నించింది.
హాల్టికెట్.. నోటిఫికేషన్ కాదు
హాల్టికెట్లోని సూచనలను పరిశీలిస్తే బయోమెట్రిక్ లేదన్న విషయం తెలుస్తుందని ఏజీ చెప్పగా హాల్టికెట్ నోటిఫికేషన్ కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘కీలకమైన పోస్టుల భర్తీ ప్రక్రియ ఇది. ఇందులో ఎంపికైనవారు భవిష్యత్తులో కన్ఫర్డ్ ఐఏఎస్లై విధాన రూపకల్పనలో భాగస్వాములవుతారు. వీరిలో తప్పుడు మార్గాల్లో వచ్చిన వ్యక్తులుంటే పరిస్థితి ఏంటి? జూన్11న నిర్వహించిన పరీక్షకు సంబంధించి మీరు తొలుత సమర్పించిన వివరాల ప్రకారం హాజరైనవారి సంఖ్య 2,33,248 కాగా జూన్ 28నాటి వెబ్నోట్ ప్రకారం ఆ సంఖ్య 2,33,506. అదనంగా 258 మంది ఎక్కడి నుంచి వచ్చారు’ అని ప్రశ్నించింది. ఏజీ సమాధానమిస్తూ పరీక్ష నిర్వహణ రోజు ఫోన్ ద్వారా అందిన వివరాలు, తరువాత కచ్చితమైన వివరాలతో నివేదిక రూపొందించినట్లు తెలిపారు. ఒకరి బదులు మరొకరు పరీక్ష రాయకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. హాల్టికెట్లోని ఫొటోలతో ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డుల ద్వారా ధ్రువీకరించినట్లు చెప్పారు. ఎక్కడా ఆరోపణలు లేవని, పటిష్ఠంగా నిర్వహించడానికి అన్ని చర్యలూ తీసుకున్నామన్నారు. అభ్యర్థుల తరఫున సీనియర్ న్యాయవాది ఎ.గిరిధర్రావు వాదనలు వినిపిస్తూ పోలీసు నియామక మండలి నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షలకు 6 లక్షల మంది హాజరయ్యారని, బయోమెట్రిక్ విధానం అమలు చేశారన్నారు. ఇక్కడ రెండు లక్షల మందికి ఏర్పాట్లు చేయలేరా అని ప్రశ్నించారు.
అనుబంధ నోటిఫికేషన్లో బయోమెట్రిక్ విధానం మినహాయిస్తే?
‘ఒకవేళ మేము పరీక్షను రద్దు చేసి, మళ్లీ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించామనుకోండి... అప్పుడు కమిషన్ బయోమెట్రిక్ను మినహాయిస్తూ అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసి పరీక్ష నిర్వహిస్తే పరిష్కారం ఏమిటి’ అని అభ్యర్థుల తరఫు సీనియర్ న్యాయవాది ఎ.గిరిధర్రావును హైకోర్టు ప్రశ్నించింది. అలా పరీక్షలు నిర్వహించే అధికారం కమిషన్కు ఉందని నోటిఫికేషన్లోనే స్పష్టంగా ఉందని తెలిపింది. ఒకవేళ తాము పరీక్షను రద్దు చేసినా కమిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందని, మళ్లీ నియామకాల్లో జాప్యం జరుగుతుందని వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితులపై పిటిషనర్లయిన అభ్యర్థుల వివరణ తెలుసుకుని చెప్పాలంది. దీనిపై గిరిధర్రావు సమాధానమిస్తూ కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే పరీక్ష నిర్వహించాలని కోరుతున్నామన్నారు. బయోమెట్రిక్కు రూ.1.30 కోట్లు ఖర్చవుతుందని అమలు చేయలేదని ఆయన అనగా ఏజీ దాంతో విభేదించారు. లాజిస్టిక్స్ కారణం వల్ల ఏర్పాటు చేయలేదన్నారు. వాదనలను విన్న ధర్మాసనం గతంలో బయోమెట్రిక్ ద్వారా నిర్వహించిన పరీక్షకు ఎంత మంది హాజరయ్యారు, ఎన్ని కేంద్రాల్లో బయోమెట్రిక్ అమలు చేయలేదు తదితర వివరాలను సమర్పించాలని కమిషన్ను ఆదేశిస్తూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్ఆర్ఆర్ నిర్మాణంతో పట్టణ రాష్ట్రంగా తెలంగాణ
పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అనుకూలమైన వాతావరణం, మంచి నీటి వసతి, నిరంతర విద్యుత్తు సరఫరా, శాంతిభద్రతలు, స్నేహపూర్వక ప్రభుత్వం కారణంగా హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా ఎదుగుతోందని చెప్పారు. -
‘నైరుతి’ ప్రయాణం మొదలైంది..
భారతదేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అయిన నైరుతి రుతుపవనాలు ఆదివారం దేశంలోని నికోబార్ దీవులపైకి ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. -
నేడు తెలంగాణ మంత్రి మండలి సమావేశం
రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. -
తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం
పురుగులు పట్టిన, కాలం చెల్లిన ఆహార పదార్థాలు... కల్తీ మసాలాలు.. మళ్లీ మళ్లీ కాచి వాడుతున్న నూనెలు.. అపరిశుభ్రమైన వంటశాలలు.. రాష్ట్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, మండీలు, ఐస్క్రీం పార్లర్లు, కాఫీ షాప్లలో పరిస్థితి ఇది. -
ఆశతో పెట్టుబడి.. మోసాలకు పట్టుబడి
రూ.వెయ్యి పెడితే రూ.10 వేలు, రూ.లక్ష పెడితే రూ.10 లక్షల లాభం చూపిస్తామంటే ఎవరికైనా ఒకసారి ప్రయత్నిద్దామని ఆశ పుడుతుంది. -
మన వ్యాధుల భారంలో 56%.. తిండి వల్లే
మన జీవనశైలి, ఆహారపు అలవాట్లలో గణనీయ మార్పులు వస్తున్నాయి. ఇవి ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. -
దేశానికి తెలుగు ‘వెలుగు’లు
మీ ఇంట్లో కరెంటు వెలుగు రావాలన్నా, మీరు వినియోగించే అనేక ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు నడవాలన్నా కావాల్సిన కీలక ఇంధనం బొగ్గు. -
మత్తు అనర్థాలపై అవగాహన: ఐఎంఏ
మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్.. తెలంగాణ రాష్ట్ర మానసిక ఆరోగ్య కమిటీ ప్రకటించింది. -
తగ్గిన గనులశాఖ ఆదాయం
రాష్ట్రంలో గనుల శాఖకు 2023-24లో రూ.5,439.93 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో సగానికిపైగా బొగ్గు ద్వారానే వచ్చింది. కాగా ఇసుక ఆదాయ లక్ష్యసాధనలో గనులశాఖ వెనుకబడింది. -
తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి
రాష్ట్రంలో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంక్షేమ సమితి అధ్యక్షుడు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
రెండు, మూడు నెలల్లో… బీబీనగర్-గుంటూరు డబ్లింగ్ పనులు
తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన బీబీనగర్-గుంటూరు రెండో లైన్ పనులు రెండు, మూడు నెలల్లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. -
జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలు విడుదల
బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆదివారం విడుదల చేసింది. -
థింపూలో ఏబీటీవో కార్యాలయం ప్రారంభం
భూటాన్ రాజధాని థింపూలో అసోసియేషన్ ఆఫ్ బుద్ధిస్ట్ టూర్ ఆపరేటర్ల (ఏబీటీవో) కార్యాలయం ఆదివారం ప్రారంభమైంది. -
29, 30 తేదీల్లో వనదేవతల గద్దెలకు తాళాలు
మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ నెల 29, 30 తేదీల్లో మూసివేస్తున్నట్లు పూజారులు ప్రకటించారు. -
నేటి నుంచే ‘టెట్’
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సోమవారం ప్రారంభం కానుంది. జూన్ 2వరకు జరిగే ఈ పరీక్ష మొదటి పేపర్కు 99,958 మంది, రెండో పేపర్కు 1,86,428 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. -
నేటి నుంచి యాదాద్రీశుడి జయంతి ఉత్సవాలు
యాదాద్రి క్షేత్రంలో ఈ నెల 20 నుంచి 22 వరకు నారసింహుడి వార్షిక జయంతి మహోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
‘మత్తు’ నియంత్రణకు కదిలిన యంత్రాంగం
రాష్ట్రంలో నాటుసారాను మూడు నెలల్లో నిర్మూలించడంతోపాటు గంజాయిని నియంత్రించాలనే లక్ష్యంలో భాగంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాచరణ ప్రారంభించింది. -
వాతావరణ మార్పులతో ‘ఆర్థిక విధ్వంసం’
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని, ఊహించిన దానికన్నా ఆరు రెట్లు ఎక్కువగా విధ్వంసం ఉందని ఓ అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. -
ప్రమాదంలో భావప్రకటన స్వేచ్ఛ
దేశంలో భావప్రకటన స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడ్డాయని ఒడిశా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డా.ఎస్.మురళీధర్ అన్నారు. -
ముంచుకొచ్చిన వానలు.. మొలకెత్తిన వడ్లు
ములుగు జిల్లా వెంకటాపూర్లోని కొనుగోలు కేంద్రంలో సన్న ధాన్యం ఆరబోయగా మొత్తం ఇలా మొలకెత్తాయి. జిల్లా రైతాంగాన్ని పది రోజులుగా అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. -
ఆధార్ అనుసంధానం కాకున్నా..‘డెత్ క్లెయిమ్’లు పరిష్కరించండి
ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాకు ఆధార్ నంబర్ అనుసంధానం కాకుండా చనిపోయిన చందాదారుల క్లెయిమ్లు పరిష్కరించేందుకు ఈపీఎఫ్వో వెసులుబాటు కల్పించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
ఆప్ రూ.7.08 కోట్ల విదేశీ నిధులను సేకరించింది: ఈడీ
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ