IIT madras: ఐఐటీ మద్రాస్లో ఏపీ విద్యార్థి ఆత్మహత్య.. నెల రోజుల్లో రెండో ఘటన!
మద్రాస్ ఐఐటీలో నెల రోజుల వ్యవధిలోనే మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏపీకి చెందిన పుష్పక్ శ్రీ సాయి అనే బీటెక్ మూడో సంవత్సరం బలవన్మరణం చెందాడు.
చెన్నై: తమిళనాడు(tamilnadu)లోని ప్రతిష్టాత్మక మద్రాస్ ఐఐటీ(IIT madras)లో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఏపీకి చెందిన పుష్పక్ శ్రీ సాయి (20) అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరివేసుకొని బలవన్మరణం చెందినట్టు పోలీసులు వెల్లడించారు. నెల రోజుల వ్యవధిలో ఈ విద్యా సంస్థలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం కలకలకం రేపుతోంది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నసాయి తన గదిలోనే ఉరివేసుకొని కనిపించినట్టు పోలీసులు తెలిపారు. అకాడమిక్ సంబంధిత సమస్యల వల్లే అతడు ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అభిప్రాయపడుతున్నట్టు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారి ఒకరు తెలిపారు. అయితే, విద్యార్థి స్వస్థలం ఏపీలో ఎక్కడ అనే సమాచారం తెలియరాలేదు. తోటి విద్యార్థులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి, పోస్టుమార్టం తర్వాతే మిగతా వివరాలు చెప్పగలమని చెప్పారు. ఫిబ్రవరి 14న ఐఐటీ మద్రాస్లో ఇంజినీరింగ్ పీజీ విద్యార్థి హాస్టల్ గదిలోనే ఉరివేసుకొని బలవన్మరణం చెందిన విషయం తెలిసిందే.
ఈ ఘటనపై ఐఐటీ మద్రాస్ స్పందించింది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన మూడో సంవత్సరం బీటెక్ విద్యార్థి అకాల మరణం తీవ్ర ఆవేదన కలిగించిందని పేర్కొంది. కరోనా తర్వాత వాతావరణం సవాల్తో కూడుకున్నదిగా మారిందని, తమ క్యాంపస్లో విద్యార్థులు/ అధ్యాపకులు, సిబ్బంది శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని మెరుగైన పరిస్థితులు కల్పించేందుకు కృషిచేస్తున్నట్టు తెలిపింది. ఎన్నికైన విద్యార్థి ప్రతినిధులతో పాటు విద్యాసంస్థ అంతర్గత కమిటీ ఇలాంటి వ్యవహారాలను పరిశీలిస్తుందని పేర్కొంది. విద్యార్థి తల్లిదండ్రులకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్టు వెల్లడించింది. ఈ దుఃఖ సమయంలో తమ సంస్థ తరఫున ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!