Tirumala : శ్రీవారి నడకదారిలో గుండెపోటుతో డీఎస్పీ మృతి

తిరుమల శ్రీవారి నడకదారిలో ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ కృపాకర్‌(59) గుండెపోటుతో మృతి చెందారు.

Published : 25 Nov 2023 12:02 IST

తిరుమల: తిరుమల శ్రీవారి నడకదారిలో ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ కృపాకర్‌(59) గుండెపోటుతో మృతి చెందారు. 1,805 మెట్టు వద్ద ఆయన కన్నుమూశారు. ఆస్పత్రికి తరలించేలోపే డీఎస్పీ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి భద్రతా విధుల నిమిత్తం కృపాకర్‌ తిరుమలకు వచ్చారు. ఆయన స్వస్థలం విజయవాడ సమీపంలోని పోరంకి. ఈ ఘటనపై కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు