Microsoft data centre: హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్.. 15వేల కోట్లతో ఏర్పాటు
Microsoft to set-up at Hyderabad: హైదరాబాద్లో రూ.15వేల కోట్ల భారీ పెట్టుబడితో నూతన డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియా ముందుకొచ్చింది.
హైదరాబాద్: హైదరాబాద్లో రూ.15వేల కోట్ల భారీ పెట్టుబడితో నూతన డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియా ముందుకొచ్చింది. 2025 నాటికి ఇది అందుబాటులోకి రానుందని కంపెనీ ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి ప్రకటించారు. రాబోయే రోజుల్లో మైక్రోసాఫ్ట్కు దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్గా నిలుస్తుందని చెప్పారు. గచ్చిబౌలిలోని తమ క్యాంపస్లో సోమవారం కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు.
దేశంలోని పుణె, ముంబయి, చెన్నై నగరాల్లో మైక్రోసాఫ్ట్కు ఇప్పటికే మూడు డేటా సెంటర్లు ఉన్నాయి. హైదరాబాద్లో ఏర్పాటయ్యేది నాలుగోది కానుంది. డేటా సెంటర్ ఏర్పాటులో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు కనీసం 24 నెలలైనా పడుతుందని, 2025 కల్లా కార్యకలాపాలు పూర్తి కానున్నాయని అనంత్ మహేశ్వరి చెప్పారు. దేశ డిజిటల్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో క్లౌడ్, డేటా సెంటర్ల వినియోగానికి విస్తృత ప్రాధాన్యం ఏర్పడిందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఏటా ఈ రంగం రెండంకెల వృద్ధిని నమోదు చేస్తోందని, దేశ క్లౌడ్, డిజిటల్ అవసరాలను తీర్చేందుకు మైక్రోసాఫ్ట్ ముందుకు రావటం హర్షణీయమని చెప్పారు.
హైదరాబాద్కు డేటా సెంటర్ రావడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. ఐటీ ఎగుమతుల్లో గతేడాదితో పోలిస్తే 12.8 శాతం వృద్ధిని నమోదు చేసిన రాష్ట్ర ఐటీ రంగం.. డేటా సెంటర్లకు కేంద్రంగా ఎదుగుతోందని చెప్పారు. పబ్లిక్ క్లౌడ్ ప్రొవైడింగ్లో విస్తృత అవకాశాలున్నాయని, మైక్రోసాఫ్ట్లా కంపెనీలు వాటిని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధిలో దీన్ని మరో మైలురాయిగా అభివర్ణించారు. డేటా సెంటర్ ఏర్పాటు వల్ల స్థానికంగా వ్యాపారాభివృద్ధి చెందడంతో పాటు ఉపాధి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల