Nara Bhuvaneshwari: తెదేపా కార్యకర్త కుటుంబాన్ని ఓదార్చిన నారా భువనేశ్వరి

తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర కొనసాగుతోంది.

Updated : 02 Feb 2024 15:54 IST

ఆత్మకూరు: తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర కొనసాగుతోంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలో ఆమె పర్యటిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను తట్టుకోలేక అల్లిపురంలో గుండెపోటుతో మృతిచెందిన తెదేపా కార్యకర్త కముజుల ఆంజనేయరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి రూ.3లక్షల ఆర్థికసాయం చెక్కును అందజేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని