Botsa: రెండుమూడేళ్లకు జీతాలపెంపు సాధ్యం కాదు: బొత్స

అంగన్వాడీల 11 డిమాండ్లలో ఇప్పటికే 10 పరిష్కరించామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

Updated : 07 Jan 2024 21:38 IST

అమరావతి: అంగన్వాడీల 11 డిమాండ్లలో ఇప్పటికే 10 పరిష్కరించామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మిగిలిన ఒక్కటి కూడా 3 నెలల తర్వాత పరిశీలిస్తామని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని, అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ప్రభుత్వాలు ఐదేళ్లకు ఒక్కసారే ఉద్యోగుల జీతాలు పెంచుతాయని, రెండు మూడేళ్లకు పెంచడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అంగన్వాడీల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని