ఉత్తరాఖండ్లో 2382 మంది పోలీసులకు కరోనా
తాజాగా ఉత్తరాఖండ్లో 2382 మంది పోలీసులుకు కొవిడ్ పాజిటివ్గా తేలింది.
* వీరిలో 93శాతం మందికి రెండుడోసుల టీకా పూర్తి
డెహ్రాడూన్: ఫ్రంట్లైన్ వారియర్స్గా సేవలందిస్తున్న పోలీసులకు కరోనా మహమ్మారి మరిన్ని సవాళ్లు విసురుతోంది. తాజాగా ఉత్తరాఖండ్లో 2382 మంది పోలీసులుకు కొవిడ్ పాజిటివ్గా తేలింది. వీరిలో 93శాతం మంది రెండు డోసుల టీకా వేయించుకున్నట్లు ఆ రాష్ర్ట డిఐజీ నీలేష్ ఆనంద్ భర్నే తెలిపారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. 'మిషన్ హౌస్లా' అనే డ్రైవ్ను రాష్ర్ట పోలీసుశాఖ గతనెల ప్రారంభించింది. ఇందులో భాగంగా కొవిడ్ బాధితులైన 2,726 మందికి ఆక్సిజన్ సిలిండర్లు, 792 మందికి ఆసుపత్రులలో పడకలు, 217 మందికి ప్లాస్మా, రక్తదానం తదితరాలను పోలీసులు అందేలా చేశారు. 17,609 మంది రోగులకు మందులు అందించారు. ఇవే కాకుండా, రేషన్, పాలు, వండిన ఆహారాన్ని అందించడం ద్వారా 94,484 మందిని ఆదుకున్నారు. అంబులెన్స్ల ఏర్పాటు, మృతదేహాల దహనంలోనూ పోలీసులు సహాయం చేస్తున్నారు. కాగా ఈ డ్రైవ్లో పాల్గొన్న 2382 మంది పోలీసుల్లో ఐదుగురితో పాటు వారి కుటుంబసభ్యుల్లో 64 మంది వైరస్కు బలయ్యారు. విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ర్ట ప్రజల రక్షణకోసం ప్రాణాలకు తెగించి తమ విధులను నిర్వర్తిస్తున్నారని ఎంతోమంది పోలీసులను ప్రశంసిస్తున్నారు. మొదటిదశలో 1982 మంది పోలీసులకు వైరస్ సోకగా.. 8 మంది మరణించారు. ప్రసుత్తం ఉత్తరాఖండ్ లాక్డౌన్ జూన్ 8 వరకు పొడిగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
భక్తులంతా వేయికళ్లతో ఎదురుచూసిన సింహాద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శనం సాక్షాత్కారమైంది. వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలంలో చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
సినీ నటుడు చిరంజీవి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నాటి జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
-
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
-
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..