Telangana Rain Alert: రాగల 3 గంటల్లో వర్షం కురిసే జిల్లాలివీ.. వాతావరణశాఖ ప్రకటన

రాగల 3 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Published : 14 Oct 2022 12:08 IST

హైదరాబాద్‌: రాగల 3 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌ నగరంతో పాటు రంగారెడ్డి, సూర్యాపేట, నల్గొండ, నాగర్‌ కర్నూల్‌, యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌, సంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌, హనుమకొండ, వరంగల్‌, జగిత్యాల, జనగామ, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కొమురంభీమ్‌ ఆసిఫాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే వీలుందని వెల్లడించింది. కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని