
Updated : 25 Jan 2022 17:04 IST
AP News: జీవోలను వెనక్కి తీసుకోవాలనడం సరికాదు: సజ్జల
అమరావతి: ఒకసారి జారీ చేసిన జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేయడం సరికాదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏదీ అడగకుండానే సీఎం జగన్ ఇచ్చారని చెప్పారు. అమరావతిలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నానితో కలిసి సజ్జల మీడియాతో మాట్లాడారు.
నిన్నటిలాగే మంత్రుల కమిటీ నేడు కూడా ఎదురుచూసిందని ఆయన చెప్పారు. ఉద్యోగ సంఘాల నేతలు ఆలస్యంగా వచ్చినా వేచి చూశామన్నారు. స్టీరింగ్ కమిటీ నేతలు వచ్చి కలిశారని.. పీఆర్సీ జీవోలు నిలుపుదల చేయాలని కోరారన్నారు. ఇంతకాలం చేసిన ప్రక్రియను తిరగతోడటం సరికాదని.. ఏమైనా మార్పులు ఉంటే వాటి గురించి మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని చెప్పారు. ఈనెల 27న మళ్లీ చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలను కోరినట్లు సజ్జల తెలిపారు.
Tags :