Sitrang Cyclone: రాగల 12గంటల్లో తీవ్ర తుపానుగా ‘సిత్రాంగ్‌’: ఐఎండీ

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ‘సిత్రాంగ్‌’ స్థిరంగా కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం తెలిపింది. రాగల 12 గంటల్లో ఇది తీవ్ర తుపానుగా మారే సూచనలు ఉన్నాయని ఐఎండీ అంచనావేసింది. 

Updated : 24 Oct 2022 15:44 IST

Sitrang Cyclone: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ‘సిత్రాంగ్‌’(Sitrang Cyclone) స్థిరంగా కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం(IMD) తెలియజేసింది. ఈ తుపాను ఉత్తర ఈశాన్య దిశగా గంటకు 21కి.మీ వేగంతో కదులుతుందని.. ప్రస్తుతం సాగర్‌ దీవికి 380కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ వెల్లడించింది. రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారే సూచనలు ఉన్నాయని అంచనా వేసింది. రేపు ఉదయానికి బంగ్లాదేశ్‌లోని టికోనా దీవికి సమీపంలో బరిసాల్‌ వద్ద తీరాన్ని దాటే సూచనలు ఉన్నట్టు తెలిపింది. అనంతరం వాయుగుండంగా, ఆ తదుపరి అల్పపీడనంగా బలహీనపడుతుందని పేర్కొంది. తుపాను ‘సిత్రాంగ్‌’ ప్రభావంతో తూర్పు తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. తుపాను పరిసర ప్రాంతాల్లో 2.4 మీటర్ల ఎత్తున సముద్రపు అలలు ఎగిసిపడుతున్నట్లు ఐఎండీ వివరించింది. ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర, పశ్చిమబెంగాల్‌ తీర ప్రాంత మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని