EastCoast Train: ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. భయంతో ప్రయాణికుల పరుగులు

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్ద ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్‌లో పొగలు వచ్చాయి.

Published : 30 Nov 2023 11:09 IST

యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్ద ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్‌లో పొగలు వచ్చాయి. ఎయిర్‌ పైపు పగిలిపోవడంతో ఒక్కసారిగా  పొగలు వ్యాపించాయి. దీంతో రైలు నిపివేయడంతో ప్రయాణికులంతా భయంతో పరుగులు తీశారు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మరమ్మతులు చేసి ఎలాంటి ప్రమాదం లేదని తేల్చారు. అనంతరం రైలును అక్కడి నుంచి పంపించారు. హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని