AP news: ఏపీలో కొందరు ఐఏఎస్‌లకు పోస్టింగులు

ఎన్నికల సంఘం వేటుతో ఇటీవల బదిలీ అయిన ఏపీలోని కొందరు ఐఏఎస్‌లకు పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. 

Published : 08 Apr 2024 21:26 IST

అమరావతి: ఎన్నికల సంఘం వేటుతో ఇటీవల బదిలీ అయిన ఏపీలోని కొందరు ఐఏఎస్‌లకు పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈసీ ఆదేశాల మేరకు ఎన్నికలతో సంబంధం లేని శాఖలను వారికి కేటాయించారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోగా లక్ష్మీ షాను నియమించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా రాజాబాబు, తితిదే జేఈవోగా గౌతమి, మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్‌గా అంబేడ్కర్‌, పౌరసరఫరాల కార్పొరేషన్‌ ఎండీగా వెంకట్రామిరెడ్డి నియమితులయ్యారు. సీసీఎల్‌ఏ కార్యదర్శిగా ప్రభాకర్‌రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని