MLAs Bribery case: సీబీఐకి బదిలీ చేయడమంటే.. కేసు అక్కర్లేదన్నట్టే: తెలంగాణ సర్కారు
ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు సింగిల్ జడ్జిని ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది.
హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తును రద్దు చేస్తూ.. సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేయాలని కోరుతూ ప్రభుత్వంతో పాటు డీజీపీ, సిట్, సైబరాబాద్ సీపీ, రాజేంద్రనగర్ ఏసీపీ, మొయినాబాద్ పోలీసులు కలిసి అప్పీలు దాఖలు చేశారు. సింగిల్ జడ్జి పలు అంశాలను, సుప్రీంకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకోలేదని అప్పీలులో ప్రభుత్వం పేర్కొంది. సింగిల్ జడ్జి పిటిషన్పై తన పరిధిని కూడా దాటి ఆదేశాలు జారీ చేశారని తెలిపింది. ఈ కేసును కేంద్రం పరిధిలోని సీబీఐకి అప్పగించడమంటే.. కేసు అవసరం లేదన్నట్లేనని అప్పీలులో ప్రభుత్వం తెలిపింది.
సీఎం వ్యాఖ్యలు జాతీయ పార్టీని ఉద్దేశించినవే తప్ప..
సిట్ రద్దు చేయాలని.. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తును కొట్టివేయాలని పిటిషనర్లే కోరలేదని ప్రభుత్వం పేర్కొంది. సీబీఐకి ఇవ్వడానికి సీఎం మీడియా సమావేశాన్ని కారణంగా చూపడం తగదన్నారు. తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరిగిందని ఓ రాజకీయ పార్టీ నేతగా సీఎం మాట్లాడారని.. దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదంది. ఎన్నికైన ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు నిందితుల కుట్రను దేశ ప్రజలకు తెలిపి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నంగానే సీఎం మీడియా సమావేశాన్ని చూడాలని అప్పీలులో ప్రభుత్వం వివరించింది. ఫిర్యాదు, ఎఫ్ఐఆర్, పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇతర అంశాల ఆధారంగానే ముఖ్యమంత్రి మాట్లాడారని తెలిపింది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు జాతీయ పార్టీని ఉద్దేశించినవే తప్ప.. దర్యాప్తునకు సంబంధంలేదని పేర్కొంది. సీఎంకు సీడీలు ఎలా చేరాయో మిస్టరీగా ఉందనేది పిటిషన్కు సంబంధం లేని అంశమని వివరించింది. స్వయంగా సీఎం వీడియోలను బహిరంగపరిచినందున సిట్ వేసినప్పటికీ పెద్దగా మార్పు ఉండదనడం ఊహాజనితమని పేర్కొంది. సీఎంకు సీడీలు ఎలా చేరాయో న్యాయవాదులెవరూ వివరించలేదనడం తప్పని.. పిటిషన్లో ముఖ్యమంత్రి ప్రతివాదిగా లేరు కాబట్టి ఆయన తరఫున ఎవరూ వాదించలేదని వివరించింది. పిటిషన్లో ప్రతివాదిగా లేని సీఎం వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవడం చట్టపరంగా తగదని తెలిపింది.
అభ్యంతరముంటే ఛార్జ్షీట్ వేశాక సవాల్ చేసుకోవచ్చు..
నిందితులకు దర్యాప్తు సంస్థలను ఎంచుకునే హక్కు ఉండదని అప్పీలులో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. సిట్పై ఆరోపణలు, అనుమానాలకు ఆధారాలేమిటో వివరించలేదని అభ్యంతరం వ్యక్తం చేసింది. యూట్యూబ్లోని వీడియోలను పరిగణనలోకి తీసుకోవడం చట్టబద్ధం కాదని పేర్కొంది. యూట్యూబ్లో వీడియోలు ఉండటం నిందితులకు న్యాయపరంగా నష్టమెలాగో వివరించలేదని తెలిపింది. ప్రభుత్వాన్ని కూల్చబోయారన్న ఇలాంటి తీవ్రమైన అంశాలపై మీడియా విస్తృత ప్రచారం ఆశ్చర్యమేమీ కాదని ప్రభుత్వం పేర్కొంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రపన్నిందేనని ఎఫ్ఐఆర్లో ప్రధాన సారాంశమని.. అలాంటప్పుడు కేంద్రం పరిధిలోని సీబీఐకి ఇవ్వడమంటే కేసు అవసరం లేదన్నట్లేనని అప్పీలులో ప్రభుత్వం పేర్కొంది. సింగిల్ జడ్జీ తీర్పు రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆత్మవిశ్వాసం దెబ్బతీసేలా ఉందని పేర్కొంది. చట్టానికి అనుగుణంగానే కేసు దర్యాప్తు సాగుతుందని.. నిందితులకు అభ్యంతరముంటే ఛార్జ్షీట్ వేశాక సవాల్ చేసుకోవచ్చునని పేర్కొంది. ప్రభుత్వ అప్పీలుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!