ఆర్టీసీ × ఆర్టీసీ.. ప్రైవేటుకు లాభమా?
తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు ఎప్పుడు తిరుగుతాయనే అంశంపై సందిగ్ధం వీడలేదు. లక్షా అరవై వేల కిలోమీటర్లు మాత్రమే బస్సులు నడపాలన్న తెలంగాణ డిమాండ్తో ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు భారీగా....
ఇంటర్నెట్ డెస్క్: తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు ఎప్పుడు తిరుగుతాయనే అంశంపై సందిగ్ధం వీడలేదు. లక్షా అరవై వేల కిలోమీటర్లు మాత్రమే బస్సులు నడపాలన్న తెలంగాణ డిమాండ్తో ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు భారీగా తగ్గనున్నాయి. కిలోమీటర్లు, బస్సుల సంఖ్య వల్ల ఏపీఎస్ ఆర్టీసీ నష్టపోనుండగా.. తెలంగాణకు కూడా లాభం చేకూరని పరిస్థితి ఏర్పడింది. దీంతో అంతిమంగా ప్రైవేటుకు ప్రయోజనం ఒనగూరే అవకాశం ఉందన్న విమర్శలు వినవస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల మధ్య లాక్డౌన్ వల్ల ఏడు నెలలు గడుస్తున్నా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. రవాణా కార్యకలాపాలు చాలా రోజుల ముందే మొదలైనప్పటికీ అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకుంటేనే బస్సులు అనుమతిస్తామని తెలంగాణ చెప్పడంతో సర్వీసుల పునరుద్ధరణ కుదరలేదు. ఒప్పందంపై పలుమార్లు చర్చించిన అధికారులు.. కిలోమీటర్లపై కొంతకాలం క్రితం వరకు నిర్ణయం తీసుకోలేదు. ఆ తర్వాత ఇరు రాష్ట్రాలు సమానంగా లక్షా అరవై వేల కిలోమీటర్ల మేర నడపాలని నిర్ణయానికి వచ్చినా.. రూట్ల వారీగా బస్సుల వివరాలు ఇవ్వాలని తెలంగాణ కోరడంతో కొంత ప్రతిష్టంభన ఏర్పడింది. ఆ తర్వాత రూట్ల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు చర్చించి ఆమోదముద్ర వేయాల్సి ఉంది.
కొత్త ప్రతిపాదనల కారణంగా ఏపీ నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాలకు నడిపే సర్వీసులను ఏపీఎస్ ఆర్టీసీ భారీగా తగ్గించనుంది. గతంలో 1009 బస్సులను 2,65,367 కిలోమీటర్ల మేర తెలంగాణ భూభాగంలో నడుపుతుండగా.. తాజా ప్రతిపాదన వల్ల 638 సర్వీసులు లక్షా 60 వేల 999 కిలోమీటర్లకే పరిమితం చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు 746 సర్వీసుల్ని లక్షా 52 వేల 344 కిలోమీటర్లు మేర ఏపీ పరిధిలో తెలంగాణ ఆర్టీసీ తిప్పుతుండగా.. తాజాగా 76 సర్వీసులను 8 వేల కిలోమీటర్ల మేర పెంచనుంది. మొత్తంగా ఇరు రాష్ట్రాల మధ్య 295 సర్వీసులు తగ్గనున్నాయి.
లాక్డౌన్ ముందు వరకు విజయవాడ- హైదరాబాద్ మార్గంలో రోజూ 374 సర్వీసులు లక్షా 3వేల 702 కిలోమీటర్ల మేర ఏపీఎస్ ఆర్టీసీ తిప్పేది. ఇకపై 192 బస్సులను 52,524 కిలోమీటర్లు మాత్రమే నడపనుంది. ఈ ఒక్క రూట్లోనే 182 సర్వీసులు, 51,178 కిలోమీటర్ల పరిధి తగ్గనున్నాయి. గతంలో ఈ మార్గంలో టీఎస్ ఆర్టీసీ 162 బస్సులను 33,736 కిలోమీటర్ల మేర తిప్పేది. ఇప్పుడు 273 సర్వీసులకు పెంచారు. ఇకపై ఏపీతో సమానంగా 52,384 కిలోమీటర్ల మేర బస్సులు నడవనున్నాయి. రెండు రాష్ట్రాలు కలిసి 32,530 కిలోమీటర్ల మేర సర్వీసులు నడపలేని పరిస్థితి ఏర్పడబోతోంది. రాయలసీమ రూట్లోనూ దాదాపు పరిస్థితి ఉండబోతోంది. తాజా ప్రతిపాదనల వల్ల ప్రైవేటు ఆపరేటర్లు లాభపడతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ ఆర్టీసీకి స్వల్పంగా ఆదాయం పెరిగినా ఏపీఎస్ ఆర్టీసీ మాత్రం భారీగా ఆదాయం కోల్పోనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం.. కరీంనగర్లో కూలిన టెంట్లు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడదులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. -
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ న్యాయస్థానం పొడిగించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
నాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని
జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తెలుపుతూ నాని పోస్ట్ పెట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దావత్ కావాలా నాయనా!.. వ్యవసాయ క్షేత్రాల్లో కార్యకర్తల ఖుషీ
ఎన్నికల పండుగొచ్చింది.. దావత్ల మీద దావత్లు ఏర్పాటవుతున్నాయి. కార్యకర్తలను మచ్చిక చేసుకోవడానికి, ప్రచారంలో జోరు ఉండటానికి నాయకులు విందు కార్యక్రమాలను ఎంచుకుంటున్నారు. -
ఆదర్శ కేంద్రం.. ఓటుకు కదులుదాం
లోక్సభ ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల సంఘం ప్రత్యక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లకు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఇంకా రెండు రోజులే!
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు 16,972 మంది పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకోగా.. ఇప్పటి వరకు 5,200 మంది మాత్రమే వినియోగించుకున్నారు. -
రూ.2 చెల్లించు.. ఛాలెంజ్ ఓటేయ్
ఛాలెంజ్ ఓటు.. దీని గురించి ఎన్నికల సమయంలో వింటుంటాం. ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961 చట్టంలోని సెక్షన్ 49ఏలో వివరాలు ఉంటాయి. పలు సందర్భాలలో ఒకరి ఓటును మరొకరు వేస్తారు. -
భాజపా అభ్యర్థితో కాదు ప్రధానితోనే పోటీ
మనకు పోటీ భాజపా అభ్యర్థితో కాదని, ప్రధాని నరేంద్ర మోదీతోనే పోటీ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!
-
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి
-
రష్యా అధినేతగా ఐదోసారి.. ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం
-
సరదా సరదాగానే సిక్స్లు బాదేస్తాడు.. అదే స్పిన్ బౌలింగ్లోనైతే..: రవిశాస్త్రి
-
టాప్ 5 మలయాళీ చిత్రాలు.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM