Amaravati Padayatra: ఐదో రోజుకు చేరిన అమరావతి రైతుల ‘మహా పాదయాత్ర’

ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ

Updated : 05 Nov 2021 11:10 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన ‘మహా పాదయాత్ర’ ఐదో రోజుకు చేరుకుంది. ఐదోరోజు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం నుంచి ప్రారంభమైంది. మార్గంమధ్యలో ఇంజినీరింగ్‌ విద్యార్థులు పాదయాత్రకు మద్దతు తెలిపారు. తమ భవిష్యత్తు బాగుండాలంటే అమరావతే ఏపీ రాజధానిగా కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రత్తిపాడులో స్థానిక రైతులు కాడెద్దులతో స్వాగతం పలికారు. పాదయాత్ర ఇవాళ 15 కి.మీ మేరకు కొనసాగి పెదనందిపాడులో ముగియనుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని