హైదరాబాద్‌ శివారులో లారీ బోల్తా.. భారీగా ట్రాఫిక్‌జామ్‌

హైదరాబాద్‌ శివారు అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలో జాతీయ రహదారి- 65పై అదుపుతప్పిన సిమెంట్‌ మిక్సింగ్‌ లారీ బోల్తా పడింది.

Updated : 15 Jul 2021 15:33 IST

అబ్దుల్లాపూర్‌మెట్‌‌: హైదరాబాద్‌ శివారు అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలో జాతీయ రహదారి- 65పై అదుపుతప్పిన సిమెంట్‌ మిక్సింగ్‌ లారీ బోల్తా పడింది. దీంతో హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్ ఏర్పడింది. వాహనం రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్రేన్‌ సాయంతో లారీని తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని