RS Praveen Kumar: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు కరోనా

బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త, మాజీ ఐపీఎస్‌ ఆర్‌.ఎస్.ప్రవీణ్‌కుమార్‌ కరోనా

Updated : 10 Aug 2021 14:16 IST

హైదరాబాద్‌: బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త, మాజీ ఐపీఎస్‌ ఆర్‌.ఎస్.ప్రవీణ్‌కుమార్‌ కరోనా బారిన పడ్డారు. వైరస్‌ సోకడంతో ఆయన నగరంలోని గాంధీ ఆస్పత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నందున సలహాలు తీసుకొని ఇంటికి వెళ్లే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఈ నెల 8న నల్గొండలో నిర్వహించిన రాజ్యాధికార సంకల్ప సభలో పాల్గొన్న ప్రవీణ్‌కుమార్‌, బీఎస్పీలో చేరిన విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని