TS corona update: తెలంగాణలో కొత్తగా 195 కరోనా కేసులు.. ఒకరి మృతి

తెలంగాణ రాష్ట్రంలో గత 24గంటల్లో 37,108 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 195 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన

Published : 06 Dec 2021 21:04 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో గత 24గంటల్లో 37,108 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 195 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,77,138కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 4,000కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 171 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,810 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

గడిచిన 24 గంటల వ్యవధిలో ఎట్‌ రిస్క్ దేశాల నుంచి శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఆర్‌జీఐఏ) 535 మంది చేరుకున్నారు. వీరిలో ఎవరికీ కొవిడ్ నిర్ధారణ కాలేదు. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన వారిలో 13 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ఈ 13 మంది నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు అధికారులు పంపించారు. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ఫలితాల్లో 13 మందికి నెగెటివ్‌ వచ్చింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని