నియంత పాలన నుంచి విముక్తి చేయాలని కోరుకున్నా: విజయశాంతి

కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజల్ని కాపాడాలని సింహవాహినీ మహంకాళి

Published : 01 Aug 2021 14:40 IST

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజల్ని కాపాడాలని సింహవాహినీ మహంకాళి అమ్మవారిని కోరుకున్నట్లు భాజపా నేత విజయశాంతి తెలిపారు. లాల్‌దర్వాజా బోనాల సందర్భంగా పాతబస్తీలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో భాజపాను అధికారంలోకి తీసుకొస్తే బంగారు బోనం సమర్పిస్తానని మొక్కుకున్నట్లు విజయశాంతి చెప్పారు. అమ్మవారు చాలా శక్తిమంతమైనదని.. ఎక్కడ చూసినా పండుగ వాతావరణ కనిపిస్తోందన్నారు. నిజమైన భక్తులకు అమ్మవారి ఆశీర్వాదం ఉంటుందని.. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు అందరూ కలిసి పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. నియంత పాలనలో తెలంగాణ తల్లి నలిగిపోతోందని.. దీని నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి చేయాలని అమ్మవారిని కోరినట్లు చెప్పారు.    

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని