Andhra News: ఆలూరులో పదో తరగతి లెక్కల ప్రశ్నపత్రం లీక్‌ కలకలం

కర్నూలు జిల్లా ఆలూరులో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్‌ కావడం కలకలం రేపింది. సోమవారం పదో తరగతి లెక్కల పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్నం సెల్‌ఫోన్‌లో ప్రత్యక్షమైంది.

Updated : 02 May 2022 16:48 IST

ఆలూరు గ్రామీణం: కర్నూలు జిల్లా ఆలూరులో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్‌ కావడం కలకలం రేపింది. సోమవారం పదో తరగతి లెక్కల పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్నం సెల్‌ఫోన్‌లో ప్రత్యక్షమైంది. పరీక్ష జరుగుతుండగా ఓ యువకుడు అతని స్నేహితులకు కాపీ చిట్టీలు వేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై యువకుడిని గుర్తించి పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను తీసి పరిశీలించగా ప్రశ్నాపత్రం కనిపించింది. ఎస్సై ఈ విషయాన్ని వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి రంగంలోకి దిగి  ఆలూరులో సర్కిల్‌ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ప్రశ్నాపత్రం ఎలా వచ్చింది..? ఎవరు పంపారు..? పేపర్‌ లీక్‌లో ఎవరెవరి హస్తం ఉందన్న దానిపై విచారణ చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని