Pregnancy Care: గర్భం ధరించారా? ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి!
అమ్మ అవ్వడం ఓ వరం. అది ఆడవాళ్లకు మాత్రమ దక్కిన అదృష్టం. నవమాసాలు మోసి ఒక ప్రాణాన్ని ఈ లోకానికి తీసుకువస్తుంది.
ఇంటర్నెట్ డెస్క్: అమ్మ కావడం ఓ వరం. అది ఆడవాళ్లకు మాత్రమే దక్కిన అదృష్టం. నవమాసాలు మోసి ఒక ప్రాణాన్ని ఈ లోకానికి తీసుకువస్తుంది. బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో కచ్చితంగా తెలుసుకోవాలి. మొదటి రోజు నుంచి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడతాయి? వాటికి పరిష్కారం ఏంటో తెలుసుకుందాం రండి!
కాఫీ, టీలకు కాస్త దూరంగా ఉండండి!
కొంతమందికి కాఫీ, టీలు ఎక్కువగా తాగుతుంటారు. కానీ గర్భం దాల్చిన సమయంలో వీటికి కాస్త దూరంగా ఉంటేనే మంచిదంటున్నారు నిపుణులు. వీటిల్లో ఉండే కెఫిన్ బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుందట.
వేడినీళ్ల స్నానం తగ్గించండి!
బాగా మరిగిన వేడి నీటితో స్నానం చేయడం గర్భిణులకు అంత మంచిది కాదు. గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి.
మద్యపానం, ధూమపానం చేయకూడదు.
గర్భంతో ఉన్నప్పుడు మద్యపానం, ధూమపానం చేస్తే బిడ్ద మెదడు, అవయవాలు పెరిగే క్రమంలో ఇబ్బందులు తలెత్తుతాయి.
ఒకే దగ్గర కూర్చోకూడదు..
ఎక్కువ సమయం పాటు ఒకే ప్రాంతంలో కూర్చోకూడదు. అటు ఇటు నడుస్తూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా శరీరానికి వ్యాయామంలా పని చేస్తుంది.
హై హీల్స్ వద్దు!
బయటకు వెళ్లేటప్పుడు ఫ్లాట్గా ఉన్న చెప్పులను మాత్రమే ధరించాలి. హై హీల్స్ వేసుకోకూడదు.
బరువులకు దూరం..
గర్భం దాల్చిన రోజు నుంచి ప్రసవం అయ్యేంత వరకు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. బరువులు మోయడం అసలు చేయకూడదు. ఇలా చేయడం తల్లి, బిడ్డకు ఎంతో ప్రమాదకరం.
చేయాల్సిన పనులు:
* ఈ సమయంలో తల్లి ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని చుట్టూ ఏర్పాటు చేసుకోవాలి.
* తల్లి ప్రతి కదలికను బట్టి కడుపులో ఉన్న బిడ్డ స్పందిస్తూ ఉంటుంది. అందువల్ల తల్లి ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
* భయాందోళనలు కలిగించే దృశ్యాలు, పెద్ద పెద్ద అరుపులు, గొడవలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలి.
* ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి.
* పుస్తకాలు చదువుతూ ఉండాలి.
* శ్రావ్యంగా ఉండే సంగీతాన్ని వినాలి.
* మంచి ఆహారం తీసుకోవాలి. ఈ సమయంలో ఎంత ఎక్కువ ఆహారం తీసుకుంటే బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటారు.
మొదటి రోజు నుంచి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ అందమైన, ఆరోగ్యమైన పాపాయికి ఇంటికి ఆహ్వానించండి. మీ జీవితంలో ఆనందాలను నింపుకోండి!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!