Srisailam: శ్రీశైలం మల్లన్నకు శ్రీవారి తరఫున పట్టు వస్త్రాలు

శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి తిరుమల శ్రీవారి తరఫున తితిదే ఈవో ధర్మారెడ్డి సోమవారం పట్టువస్త్రాలు సమర్పించారు.

Published : 04 Mar 2024 20:00 IST

శ్రీశైలం: శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి తిరుమల శ్రీవారి తరఫున తితిదే ఈవో ధర్మారెడ్డి సోమవారం పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు శ్రీశైలం ఆలయ ఛైర్మన్‌ చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీశైలంలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాలకు తితిదే తరఫున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. మార్చి 1న ప్రారంభమైన ఈ ఉత్సవాలు 11వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు