Viveka Murder Case: వివేకా హత్య కేసు.. విచారణ వాయిదా

వివేకా హత్య కేసు విచారణను సీబీఐ కోర్టు సెప్టెంబర్‌ ఒకటో తేదీకి వాయిదా వేసింది.

Updated : 14 Aug 2023 14:02 IST

హైదరాబాద్‌: వివేకా హత్య కేసు విచారణను సీబీఐ కోర్టు సెప్టెంబర్‌ ఒకటో తేదీకి వాయిదా వేసింది. ఈ విచారణకు వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి హాజరయ్యారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌కుమార్‌ యాదవ్‌ను చంచల్‌గూడ జైలు అధికారులు కోర్టులో హాజరు పర్చారు.

మరోవైపు నాలుగురోజుల క్రితం దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని సీబీఐకి కోర్టు ఆదేశించింది. సీబీఐ కౌంటర్‌ దాఖలు చేస్తే దానిపై ఈరోజే విచారణ జరిగే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని