75 ఏళ్ల తరవాత మరో యుద్ధం చేస్తున్నాం:ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవకాశం దొరికితే చాలు అంతర్జాతీయ వేదికలపై చైనా చర్యలను ఎండగడుతుంటారు.
చైనాపై విరచుకుపడిన అమెరికా అధ్యక్షుడు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవకాశం దొరికితే చాలు అంతర్జాతీయ వేదికలపై చైనా చర్యలను ఎండగడుతుంటారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణకు ఆ దేశ చర్యలే కారణమంటూ మరోసారి విరుచుకుపడ్డారు. ఈ చైనా వైరస్ వ్యాప్తికి ఐరాస ఆ దేశాన్ని జవాబుదారీ చేయాలంటూ డిమాండ్ చేశారు. అగ్రరాజ్యంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభించడంతో 2లక్షల మంది అమెరికన్లు బలయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఆ సంఖ్య సుమారు 10లక్షలుగా ఉంది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని ఐరాస సర్వ ప్రతినిధి సభ 75వ వార్షిక సమావేశాల్లో వీడియో సందేశం ద్వారా చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన 75 సంవత్సరాల తరవాత ప్రపంచం అతి పెద్ద సమస్యను ఎదుర్కోంటోంది. కనిపించని శత్రువైన ‘చైనా వైరస్’పై తీవ్ర పోరాటం చేస్తున్నాం. 188 దేశాల్లోని అనేక మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మన ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తికి కారణమైన చైనాను జవాబుదారీ చేయాలి. ఈ మహమ్మారి ప్రారంభ దశలో చైనా దేశీయంగా ప్రయాణాలపై ఆంక్షలు విధించిన్పటికీ, అంతర్జాతీయంగా ఎలాంటి ఆంక్షలు విధించకుండా వైరస్ వ్యాప్తికి కారణమైంది’ అంటూ ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అలాగే ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తీరును తప్పుబట్టారు. ఆ సంస్థ చైనా ఆడించినట్లు ఆడుతోందని విమర్శించారు. ‘చైనా ప్రభుత్వం, అది చెప్పినట్లు ఆడే ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదట్లో మనుషుల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకినట్లు ఆధారాలు లేవని ప్రకటించాయి. తరవాత లక్షణాలు లేని వ్యక్తుల నుంచి ఈ వైరస్ వ్యాపించదని మరో తప్పుడు ప్రకటన చేశాయి. ఐరాస వారి చర్యలను పరిగణనలోకి తీసుకొని చైనాను జవాబుదారీ చేయాలి’ అంటూ చైనాపై మండిపడ్డారు.
అంతేకాకుండా పర్యావరణానికి తీవ్ర స్థాయిలో హాని కలిగించే విధంగా చైనా తీరు ఉందని ఆ దేశ చర్యలను దుయ్యబట్టారు. ‘యూఎస్ కంటే చైనా నుంచి కార్బన్ ఉద్గారాల శాతం రెట్టింపుగా ఉంది. ఆ పెరుగుదల కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆ దేశం మిలియన్ల కొద్ది టన్నుల్లో ప్లాస్టిక్ను సముద్రాల్లోకి విచ్చలవిడిగా కుమ్మరించడంతో పగడపు దిబ్బలకు హాని కలుగుతోంది. ఇతర దేశాల సముద్రజల్లాల్లోకి చొచ్చుకొని వచ్చి పరిమితికి మించి చేపలు పడుతుండటం తీవ్ర పరిణామం’ అంటూ చైనా చర్యలను ఖండించారు.
కరోనా వైరస్ చైనాలోని వూహాన్ నుంచి ప్రపంచాన్ని కమ్మేసిందని నిపుణులు భావిస్తున్నారు. దీని కారణంగా ఆమెరికా తీవ్రంగా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కాగా, వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానుందని, దాన్ని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి, వైరస్కు అమెరికా చరమగీతం పాడుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి ఏదో ఒక అంశంపై చైనాపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. చైనా కూడా ఆ విమర్శలను గట్టిగానే తిప్పికొడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘400 మంది మహిళలపై ప్రజ్వల్ అఘాయిత్యం’ - రాహుల్ సంచలన ఆరోపణ
హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) దాదాపు 400 మంది మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని రాహుల్ గాంధీ ఆరోపించారు. -
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
Prajwal Revanna: లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ప్రత్యేక దర్యాప్తు బృందం లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. -
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
Delhi Commission for Women: దిల్లీ మహిళా కమిషన్లో 223 మంది ఉద్యోగులపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వేటు వేశారు. వారిని తక్షణమే విధుల్లో నుంచి తొలగించారు. -
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
మండుటెండల్లో వాహనదారులకు కాస్త ఉపశమనం కల్పించింది పుదుచ్చేరి ప్రభుత్వం. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ షేడ్ నెట్స్ను ఏర్పాటు చేసింది. -
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
వ్యక్తుల ప్రైవేటు ఆస్తులను సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించడం చట్టబద్ధమేనా అనే న్యాయపరమైన అంశంపై తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వు చేసింది. -
వడగళ్లతో దెబ్బతిన్న రెక్కలు..విమానానికి తప్పిన ప్రమాదం
ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 170 మందితో బుధవారం మధ్నాహ్నం 1.45 గంటలకు దిల్లీకు ప్రయాణమైన విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే ప్రమాదానికి గురైంది. -
దిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
దేశ రాజధాని ప్రాంతంలోని సుమారు 150 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం బుధవారం తీవ్ర కలకలం రేపింది. -
10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ
సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు విచ్చేశారు. -
అలాగైతే హంతకులూ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రారంభిస్తారు!
అరెస్టైన రాజకీయ నాయకులకు వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్న వినతిపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కొవిషీల్డ్ సురక్షితమైందే.. ఆందోళన వద్దు
తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనకా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. -
శని, ఆదివారాలూ మాకు తీరిక ఉండదు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సెలవులు సుదీర్ఘంగా తీసుకుంటారంటూ చేసే విమర్శలపై అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. -
‘స్మార్ట్’ అస్త్ర ప్రయోగం విజయవంతం!
సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో (స్మార్ట్) అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. -
డీప్ ఫేక్ వీడియోలపై వెంటనే చర్యలుండాలి
సార్వత్రిక ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటివి వెలుగు చూసిన వెంటనే జాప్యంలేకుండా వాటి వ్యాప్తిని అరికట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాదుల బృందం దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఉష్ణోగ్రతలు గరిష్ఠ‘మే’! : ఐఎండీ
దేశంలోని పలు ప్రాంతాల్లో మే నెల సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. -
యాప్ ఆధారిత పెట్టుబడి పథకాలు.. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు
క్రిప్టోకరెన్సీ మైనింగ్ యంత్రాల అద్దెలపై పెట్టుబడుల పేరుతో మోసపూరిత పథకాల ద్వారా ప్రజల్ని ఒక యాప్ మోసగిస్తోందనే ఆరోపణలమీద దేశంలో 30 చోట్ల సీబీఐ బలగాలు సోదాలు నిర్వహించాయి. -
సూరత్ ఏకగ్రీవ ఎన్నికపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
సూరత్ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) పై అత్యవసర విచారణ జరిపేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. -
కొవిషీల్డ్పై వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి
ఆస్ట్రాజెనకా కరోనా టీకాపై తాజా దుమారం నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు, ముప్పు కారకాల అవకాశాలను పరిశీలించేందుకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. -
అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న చిత్రాలను ఆమె ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమకాని వారికి.. మే 4న ఇస్తాం: శశి భూషణ్
-
97.76% రూ.2వేల నోట్లు వెనక్కి: ఆర్బీఐ
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా