Jammu Kashmir: కశ్మీర్లో మరో ఎన్కౌంటర్.. లష్కరే తొయిబా కమాండర్ హతం
జమ్మూ- కశ్మీర్లో ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు పోలీసులు, భద్రతాదళాలు ముమ్మర చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం పుల్వామా జిల్లాలోని పాంపోర్ ప్రాంతం ద్రంగ్బల్లో పోలీసులు, భద్రతా దళాలు చేపట్టిన సంయుక్త ఆపరేషన్లో...
శ్రీనగర్: జమ్మూ- కశ్మీర్లో ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు పోలీసులు, భద్రతాదళాలు ముమ్మర చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం పుల్వామా జిల్లాలోని పాంపోర్ ప్రాంతం ద్రంగ్బల్లో పోలీసులు, భద్రతా దళాలు చేపట్టిన సంయుక్త ఆపరేషన్లో లష్కరే తొయిబా కమాండర్ ఉమర్ ముస్తాక్ ఖండేతోపాటు మరో ఉగ్రవాది హతమయ్యారు. స్థానిక పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సదరు ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారం మేరకు ఈ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు చెప్పారు. ఎన్కౌంటర్ అనంతరం వారి వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రినీ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
పోలీసుల హత్య కేసులో నిందితుడు..
ఈ ఏడాది ఆగస్టులో కశ్మీర్ పోలీసులు విడుదల చేసిన టాప్- 10 ఉగ్రవాదుల హిట్ లిస్ట్లో ఉమర్ ముస్తాక్ ఖండే పేరూ ఉంది. ఇటీవల శ్రీనగర్లో ఇద్దరు పోలీసులను హత్య చేసిన కేసులోనూ ఇతను నిందితుడని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. కశ్మీర్ లోయలో నిన్న సాయంత్రం నుంచి ఇది మూడో ఎన్కౌంటర్ కాగా, వారం వ్యవధిలో చేపట్టిన తొమ్మిదో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్. మొత్తం 13 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. కశ్మీర్లో ఇటీవల వరుసగా జరిపిన ఉగ్ర దాడుల్లో పలువురు పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో బలగాలు భారీ ఎత్తున తనిఖీలు చేపడుతున్నాయి. ప్రజల్లో భయాన్ని సృష్టించేందుకు, లోయలో అల్లర్లు, గందరగోళాన్ని వ్యాప్తి చేసేందుకు యత్నిస్తున్న ముష్కరుల ఏరివేతకు కట్టుబడి ఉన్నామని పోలీసులు ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM