భారత్లో ఒమిక్రాన్.. ఆ రోగిని కలిసిన వారిలో ఐదుగురికి కొవిడ్ పాజిటివ్!
భారత్లో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూడటం కలకలం రేపుతోంది. కర్ణాటకలో ఇద్దరు వ్యక్తుల్లో ఈ కొత్త వేరియంట్ బయటపడగా.. వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను......
బెంగళూరు: భారత్లో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూడటం కలకలం రేపుతోంది. కర్ణాటకలో ఇద్దరు వ్యక్తుల్లో ఈ కొత్త వేరియంట్ బయటపడగా.. వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించిన అధికారులు అందరికీ పరీక్షలు నిర్వహించారు. అయితే, ఒమిక్రాన్ సోకిన 46ఏళ్ల వ్యక్తితో కాంటాక్టు అయిన వారిలో ఐదుగురికి కొవిడ్ పాజిటివ్గా తేలిందని బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) కమిషనర్ గౌరవ్ గుప్తా వెల్లడించారు. దీంతో వారందరి శాంపిల్స్ని జినోమిక్ సీక్వెన్సింగ్ ల్యాబ్కు పంపినట్టు వివరించారు. అలాగే, కర్ణాటకలో ఒమిక్రాన్ సోకిన ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన వివరాలను గౌరవ్ గుప్తా విడుదల చేశారు. తొలి వ్యక్తి గత నెల 27న కొవిడ్ నెగటివ్ రిపోర్టు చూపించి దుబాయికి వెళ్లిపోయినట్టు వెల్లడించారు.
తొలి వ్యక్తి దుబాయికి తిరుగుపయనం..
మన దేశంలో తొలిసారి ఒమిక్రాన్ వెలుగుచూసిన వ్యక్తి దుబాయి వెళ్లిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. ‘‘దక్షిణాఫ్రికా నుంచి దుబాయి మీదుగా 66 ఏళ్ల వ్యక్తి నవంబర్ 20న కొవిడ్ నెగెటివ్ రిపోర్టుతో బెంగళూరు విమానాశ్రయానికి వచ్చాడు. అతడి శాంపిల్స్ను సేకరించిన అధికారులు.. కొవిడ్ పాజిటివ్గా నిర్ధారించారు. అతడిని హోటల్లో ఉంచగా వైద్యులు పరీక్షించారు. ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో హోటల్లోని స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు. నవంబర్ 22న అతడి శాంపిల్స్ని సేకరించి జీనోమిక్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. అయితే, ఆ మరుసటి రోజున ఆ వ్యక్తి స్వయంగా ఓ ప్రైవేటు ల్యాబ్లో పరీక్షించుకోగా.. నెగెటివ్ వచ్చింది. ఆయనతో 24మంది ప్రైమరీ కాంటాక్టులు ఉండగా.. అందరినీ గుర్తించి అధికారులు పరీక్షలు నిర్వహించారు. వారందరికీ నెగెటివ్గా తేలింది. ఈ నెల 22, 23 తేదీల్లో వైద్య సిబ్బంది 240మంది సెకండరీ కాంటాక్టుల్ని గుర్తించి పరీక్షలు నిర్వహించగా.. అందరికీ నెగటివ్గానే నిర్ధారణ అయింది. అయితే, గత నెల 27న అర్ధరాత్రి ఆ వ్యక్తి క్యాబ్ తీసుకొని బెంగళూరు విమానాశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి దుబాయికి వెళ్లిపోయాడు.
రెండో వ్యక్తి బెంగళూరులో వైద్యుడు!
ఒమిక్రాన్ సోకిన మరో వ్యక్తి బెంగళూరుకు చెందిన 46 ఏళ్ల వైద్యుడు. అతడు ఎక్కడికీ ప్రయాణం చేయలేదు. రెండు టీకా డోసులూ తీసుకున్నారు. గత నెల 21న జ్వరం, ఒళ్లు నొప్పులు రావడంతో ఆరోజు ఉదయం 10గంటల సమయంలో ఆర్టీ- పీసీఆర్ పరీక్ష చేయించుకున్నారు. ఆ మరుసటి రోజు సాయంత్రం 4గంటలకు కరోనా పాజిటివ్గా తెలిసింది. సీటీ వాల్యూ తగ్గుతున్నట్టు గమనించి అతడి శాంపిల్స్ని జీనోమిక్ సీక్వెన్సింగ్ ల్యాబ్కు పంపారు. గత నెల 22 నుంచి 24 వరకు హోం ఐసోలేషన్లో ఉన్న ఆయన.. 25న ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత మూడు రోజులకు (నవంబర్ 27న) డిశ్చార్జి అయ్యారు. అతడితో ప్రైమరీ కాంటాక్టులు 13 మంది ఉండగా.. 250 మంది సెకండరీ కాంటాక్టులు ఉన్నారు. నవంబర్ 22 నుంచి 25 మధ్య పరీక్షలు నిర్వహించగా ముగ్గురు ప్రైమరీ కాంటాక్టులు, ఇద్దరు సెకండరీ కాంటాక్టులకు కరోనా పాజిటివ్గా గుర్తించారు. ఐదుగురూ ఐసోలేషన్లో ఉన్నారు’’ అని బీబీఎంపీ కమిషనర్ వివరించారు. అయితే, గత 24గంటల వ్యవధిలోనే ఈ ఇద్దరు రోగుల నివేదికలు రావడంతో ఒమిక్రాన్ పాజిటివ్గా తేలినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం సాయంత్రం వెల్లడించిన విషయం తెలిసిందే.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?