రఫేల్ స్వాగతానికి సిద్ధమైన అంబాలా!
భారతదేశ శత్రువుల గుండెల్లో గుబులుపుట్టిస్తున్న అధునాతన రఫేల్ యుద్ధ విమానాలకు ఘన స్వాగతం పలికేందుకు అంబాలా వైమానిక స్థావరం సిద్ధమైంది. వైమానిక దళాధిపతి ఆర్కేఎస్ భదౌరియా విమానాలను స్వీకరించనున్నారు.......
అంబాలా: భారతదేశ వాయుసేనను బలోపేతం చేసే అధునాతన రఫేల్ యుద్ధ విమానాలకు ఘన స్వాగతం పలికేందుకు అంబాలా వైమానిక స్థావరం సిద్ధమైంది. వైమానిక దళాధిపతి ఆర్కేఎస్ భదౌరియా విమానాలను స్వీకరించనున్నారు. ఇప్పటికే పరిసర ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఫొటోలు, వీడియోలు తీయడాన్ని నిషేధించారు. మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రైవేట్ డ్రోన్ల కదలికలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వైమానిక స్థావరం సమీపంలోని జాతీయ రహదారి 1ఏ పై రాకపోకల్ని నిలిపివేశారు. విమానాలు చేరుకునే సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని రకాల కార్యకలాపాలను నిషేధిస్తూ ఆంక్షలు విధించారు. అంబాలా వైమానిక స్థావర పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించినట్లు డీఎస్పీ అశోక్ శర్మ తెలిపారు. కొవిడ్ మహమ్మారి ముప్పు లేకుంటే చుట్టుపక్కల ప్రజలు వేలాదిగా వీధుల్లోకి తరలివచ్చి యుద్ధ విమానాలను స్వాగతం పలికేవారని స్థానిక ఎమ్మెల్యే అసీం గోయల్ అభిప్రాయపడ్డారు. అయితే, రఫేల్ రాకను స్వాగతిస్తూ సాయంత్రం 7-7:30 మధ్య ఇళ్లలోనే దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు.
ఫ్రాన్స్లోని బోర్డోలో నగరం నుంచి బయల్దేరిన ఐదు రఫేల్ విహంగాలు 7000 కిలోమీటర్లు ప్రయాణించి నేడు అంబాలాకు చేరుకోనున్నాయి. దాదాపు ఏడు గంటలకుపైగా ప్రయాణించి సోమవారం యూఏఈలోని అల్ దాఫ్రా వైమానిక స్థావరానికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఇవి గాల్లోనే ఇంధనం నింపుకున్నాయి. 30 వేల అడుగులు ఎత్తులో వాటికి.. ఫ్రెంచ్ ట్యాంకర్ విమానం ఇంధనాన్ని నింపింది. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 10 గంటలకు అల్ దాఫ్రా నుంచి రఫేల్ విమానాలు బయలుదేరనున్నట్లు వైమానిక వర్గాలు తెలిపాయి. దిల్లీ, జామ్నగర్ ఏటీసీల నుంచి అందే సంకేతాలతో అంబాలాకు చేరుకుంటాయని వెల్లడించాయి.
భారత సైన్యం అమ్ముపొదిలో రఫేల్ చేరడాన్ని 23 సంవత్సరాలలో భారత వైమానిక దళంలో చోటుచేసుకుంటున్న అతికీలక పరిణామంగా రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. 4.5వ తరం విమానంగా పిలుస్తున్న ఈ విహంగాలు ప్రపంచంలోని అత్యుత్తమ యుద్ధ విమానాలలో ఒకటి. ఒకే విమానంలో అనేక మిషన్లను చేపట్టగల ‘ఓమ్నిరోల్’ విహంగంగా రక్షణశాఖ దీన్ని పరిగణిస్తోంది. ఏవియానిక్స్, రాడార్ వ్యవస్థ, ఆయుధ వ్యవస్థ పరంగా రఫేల్ దక్షిణాసియాలోనే అత్యుత్తమ యుద్ధ విమానం అని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. పాకిస్థాన్ వద్ద ఉన్న ఎఫ్-16, చైనా తయారు చేసిన ఐదో తరం జేఎఫ్-20 కంటే కూడా రఫేల్ అత్యుత్తమైనదని తెలిపారు. ఇప్పటికే అఫ్గానిస్థాన్, మాలి, లిబియా, ఇరాక్, సిరియాలో పలు సందర్భాల్లో రఫేల్ తన సత్తా చాటింది.
రఫేల్ యుద్ధ విమానాలు అంబాలా చేరుకున్న తర్వాత వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న లద్దాఖ్కు తరలించే అవకాశం ఉంది. తర్వాత విడతలో వచ్చే వాటిని పశ్చిమ బెంగాల్లోని హసిమారా వైమానిక స్థావరంలో ఉంచుతారు. ఇప్పటికే ఈ రెండు స్థావరాలను 400 కోట్లతో ఐఏఎఫ్ ఆధునికీకరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం