Sudhaa Chandran: సుధా చంద్రన్కు సీఐఎస్ఎఫ్ క్షమాపణ
కృత్రిమ అవయవదారులకు మన దేశంలోని విమానాశ్రయాల్లో తీవ్ర అవమానాలు, ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రముఖ
దిల్లీ: ప్రముఖ నర్తకి, నటి సుధా చంద్రన్కు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) క్షమాపణ చెప్పింది. విమానాశ్రయాల్లో తనలాంటి కృత్రిమ అవయవదారులకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రధాని దృష్టికి తీసుకెళుతూ ఆమె ఓ వీడియోను పోస్ట్ చేసిన నేపథ్యంలో సీఐఎస్ఎఫ్ ఈ విధంగా స్పందించింది. భవిష్యత్లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా తమ సిబ్బందికి అవగాహన కల్పిస్తామని పేర్కొంది. ఇంతకీ అసలేం జరిగిందంటే..?
కృత్రిమ అవయవదారులకు మన దేశంలోని విమానాశ్రయాల్లో తీవ్ర అవమానాలు, ఇబ్బందులు ఎదురవుతున్నాయని సుధా చంద్రన్ ఆవేదన వ్యక్తం చేశారు. తన లాంటి సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులు మంజూరు చేసి తనిఖీల పేరుతో అధికారుల నుంచి ఎదురయ్యే వేధింపులకు ముగింపు పలకాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను గురువారం ఆమె పోస్టు చేశారు. వృత్తి రీత్యా విమానాల్లో తరచూ ప్రయాణించాల్సి వస్తుందని తెలిపారు. కృత్రిమ అవయవాల్లో పేలుడు పదార్థాల వంటివి తీసుకొస్తారనే అనుమానం ఉంటుంది గనుక సంబంధిత తనిఖీలు చేసుకోవడంలో అభ్యంతరం లేదన్నారు. అయితే, విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ అధికారులు తనిఖీ చేపట్టే ప్రతిసారీ తన కృత్రిమ కాలును తొలగించి చూపించాలని ఒత్తిడి తెస్తున్నారని, ఇది తనలాంటి వారికి ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు అయిన మహిళలకు ఎంతో ఇబ్బందికరమని సుధా చంద్రన్ ఆ వీడియోలో వివరించారు. సమస్యను ప్రధాన మంత్రితో పాటు కేంద్ర, రాష్ట్రాల అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ వీడియోను పోస్టు చేస్తున్నట్లు తెలిపారు.
దీనిపై సీఐఎస్ఎఫ్ తాజాగా ట్విటర్ ద్వారా స్పందించింది. ‘సుధా చంద్రన్కు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ప్రోటోకాల్ ప్రకారం అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ప్రోస్తెటిక్స్ తొలగించాలని భద్రతా సిబ్బంది సూచించాలి. అయితే, అక్కడున్న (విమానాశ్రయంలో) మహిళా భద్రతా సిబ్బంది ఎందుకు అలా అడగాల్సి వచ్చిందో తెలుసుకుంటాం. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా మా సిబ్బందికి మరోసారి అవగాహన కల్పిస్తామని సుధాచంద్రన్కు హామీ ఇస్తున్నాం’’ అని సీఐఎస్ఎఫ్ తన ట్వీట్లో పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు