వేర్పాటువాదులకు చెంపపెట్టు లాంటి తీర్పు: ప్రసాద్
జమ్మూకశ్మీర్ జిల్లా స్థానిక సంస్థల(డీడీసీ) ఎన్నికల్లో ప్రజలు వేర్పాటువాదులు, ఉగ్రవాదులకు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారని భాజపా పేర్కొంది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం మీడియాతో మాట్లాడారు.
దిల్లీ: జమ్మూకశ్మీర్ జిల్లా స్థానిక సంస్థల(డీడీసీ) ఎన్నికల్లో ప్రజలు వేర్పాటువాదులు, ఉగ్రవాదులకు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారని భాజపా పేర్కొంది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించింది. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్ పార్టీలన్నింటికీ కలిపి వచ్చిన మొత్తం ఓట్ల కన్నా.. భాజపాకు వచ్చిన ఓట్లే అధికం. భాజపా అత్యధికంగా 74 స్థానాల్లో విజయం సాధించింది. అంతేకాకుండా భాజపా మద్దతుతో 39 మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. కానీ పీపుల్స్ అలయన్స్ కూటమిలో అన్ని పార్టీలు కలిపి సుమారు 100 స్థానాల్లో మాత్రమే గెలిచాయి. జమ్మూకశ్మీర్లో భాజపా తన బలాన్ని చూపడంతో.. వ్యాలీలో కమలం పువ్వు వికసించినట్లయింది. సొంతంగా భాజపాను ఢీకొట్టలేమని తెలిసే ఆయా పార్టీలు గుప్కార్ అలయన్స్గా ఏర్పడ్డాయి. ఇది భారతీయుల విజయం. కశ్మీర్పై ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టి ఫలితమే ఈ విజయం’ అని ప్రసాద్ వివరించారు.
‘కేంద్రం పాలనతో కశ్మీర్లో అభివృద్ధి ఊపందుకుంది. కశ్మీర్ ప్రజలు ఒకప్పుడు పాలించిన వారికి, ఇప్పుడు సేవ చేస్తున్న వారికి మధ్య తేడాను చూస్తున్నారు. ప్రజాస్వామ్యంపై వారికి నమ్మకం ఇప్పుడు మరింత పెరిగింది. ’ అని ప్రసాద్ పేర్కొన్నారు.
జమ్మూకశ్మీర్లో స్థానిక సంస్థల(డీడీసీ) ఎన్నికల పూర్తిస్థాయి ఫలితాలు బుధవారం వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో భాజపా 74 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్సీ 67, పీడీపీ 27, కాంగ్రెస్26, స్వతంత్రులు 39 స్థానాల్లో విజయం సాధించారు. ఎన్సీ, పీడీపీ మరికొన్ని పార్టీలు కలిసి పీపుల్స్ అలయన్స్ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేశాయి.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు