ట్రంప్నకు మరోసారి చుక్కెదురు!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జరిగాయని ఆరోపిస్తున్న ట్రంప్ ప్రచార బృందానికి మరోసారి చుక్కెదురైంది.
ట్రంప్ దావాను తిరస్కరించిన పెన్సిల్వేనియా కోర్టు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న ట్రంప్ ప్రచార బృందానికి మరోసారి చుక్కెదురైంది. నిబంధనలకు అనుగుణంగా లేని ఓట్లను తిరస్కరించాలని కోరుతూ వేసిన దావాను పెన్సిల్వేనియా జిల్లా కోర్టు తోసిపుచ్చింది. వేల సంఖ్యలో పోలైన ఓట్లు చెల్లవంటూ ట్రంప్ బృందం చేసిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. ఈ సమయంలో ఎన్నికల ఫలితాలను అధికారికంగా ధ్రువీకరించవచ్చని పెన్సిల్వేనియా అధికారులకు సూచించింది. ఓట్లు చెల్లవనడానికి సరైన ఆధారాలు లేవని, కేవలం ఊహాజనిత ఆలోచనలతోనే ట్రంప్ బృందం ఒత్తిడి తెస్తున్నట్లు పెన్సిల్వేనియా కోర్టు న్యాయమూర్తి మ్యాథ్యూ బ్రాన్ స్పష్టం చేశారు.
న్యాయస్థానం తీర్పుపై ట్రంప్ ప్రచార బృందం తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేసింది. ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలను చూపేందుకు సరైన సమయం ఇవ్వకుండానే కోర్టు మా విన్నపాన్ని కొట్టివేయడం దురదృష్టకరమని పేర్కొంది. అయితే, తొందరగా తీర్పు చెప్పడం వల్ల సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు మార్గం సుగమం అయ్యిందని అభిప్రాయపడింది. ఇక, 20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న పెన్సిల్వేనియాలో జో బైడెన్ దాదాపు 81 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఎన్నికల నిబంధనలు పాటించలేదంటూ.. లక్షల సంఖ్యలో పోలైన ఓట్లను రద్దు చేయాలంటూ ట్రంప్ బృందం వాదిస్తోంది. ఇందులో భాగంగా కోర్టును ఆశ్రయించగా తాజాగా దీన్ని కొట్టివేసింది.
ఇదిలా ఉంటే, ఇప్పటివరకు ఓటమిని అంగీకరించని అధ్యక్షుడు ట్రంప్ న్యాయపరంగా పోరాడుతూనే ఉన్నారు. మరోవైపు కోర్టుల్లో దావాలు నడుస్తున్న సమయంలో అధికార బదిలీకి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపుపై వివాదం కొనసాగుతున్నప్పటికీ అధ్యక్ష మార్పిడి చట్టం (ప్రెసిడెన్షియల్ ట్రాన్సషన్ యాక్ట్) ప్రకారం పాటించాల్సిన ప్రక్రియను మొదలు పెట్టినట్లు వైట్హౌస్ అధికారులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం