రఘువంశ్‌ ప్రసాద్‌ కన్నుమూత 

కేంద్ర మాజీమంత్రి రఘువంశ్‌ ప్రసాద్‌ సింగ్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయనకు వెంటిలేటర్‌ సాయంతో చికిత్స 

Updated : 13 Sep 2020 12:25 IST

పట్నా: కేంద్ర మాజీమంత్రి రఘువంశ్‌ ప్రసాద్‌ సింగ్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయనకు వెంటిలేటర్‌ సాయంతో చికిత్స  అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ అనారోగ్యానికి గురికావడంతో ఆయన దిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే ఆర్జేడీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దాదాపు 32సంవత్సరాలు పార్టీలో కొనసాగిన ఆయన, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌కు రాజీనామా లేఖను పంపారు. లాలూ ప్రసాద్‌‌ కూడా రాంచీలోని రిమ్స్‌ ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని