ఆ తర్వాతే టీకాకు అనుమతి ఇవ్వండి..!
నిశిత పరిశీలన, సరైన శాంపిల్ పరిమాణంలో ప్రయోగాలు జరిపిన తర్వాతే ఏ టీకాకైనా అత్యవసర వినియోగం కింద అనుమతి ఇవ్వాలని పార్లమెంటరీ కమిటీ ప్రభుత్వానికి నివేదించింది.
పార్లమెంటరీ కమిటీ నివేదిక
దిల్లీ: నిశిత పరిశీలన, సరైన శాంపిల్ పరిమాణంలో ప్రయోగాలు జరిపిన తర్వాతే ఏ టీకాకైనా అత్యవసర వినియోగం కింద అనుమతి ఇవ్వాలని పార్లమెంటరీ కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ నేతృత్వంలో ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ రూపొందించిన నివేదికలో తాజా అంశాలను ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దేశంలో అత్యవసర వినియోగ అనుమతిని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనేజైషన్ (సీడీఎస్సీఓ) ఇప్పటివరకు ఎవ్వరికీ ఇవ్వలేదని కమిటీ గుర్తుచేసింది. అందుకే అన్ని దశల క్లినికల్ ప్రయోగాలు పూర్తై, నిశితంగా పరిశీలన, నిపుణుల సంప్రదింపుల తర్వాతే ఏదైనా వ్యాక్సిన్కు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇలాంటి విధానాన్ని వినియోగించుకోవాలని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది.
కరోనా విజృంభణ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులే ఎనలేని భారాన్ని మోశాయని.. ప్రైవేటు ఆసుపత్రులు మాత్రం సామాన్యులకు అందుబాటులో లేవని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది. అందుకే ప్రైవేటు ఆసుపత్రులపై నిరంతర పర్యవేక్షణ, నియంత్రణ ఉండాలని పేర్కొంది. ప్రైవేటు ఆసుప్రతులపై పర్యవేక్షణ కొనసాగించడంతో పాటు మందులు బ్లాక్మార్కెట్కు తరలిపోకుండా ఉండేందుకు ఓ సమగ్ర ప్రజారోగ్య చట్టం ఉండాలని రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడుకి అందించిన నివేదికలో పార్లమెంటరీ కమిటీ వెల్లడించింది. వీటితో పాటు తక్కువ ధరలకు లభించే ఔషధాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది. అంతేకాకుండా సమాజంలో అట్టడుగు వర్గాల వారికి తక్కువ ధరకు లేదా సబ్సిడీతో కూడిన మందులను అందుబాటులో ఉంచేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగంపై ఇప్పటికే మూడు సంస్థలు కేంద్ర నియంత్రణ సంస్థలకు దరఖాస్తు చేసుకున్న సమయంలోనే తాజా నివేదిక వెల్లడి కావడం గమనార్హం. ఇప్పటికే తాము అభివృద్ధిచేసిన కరోనా వ్యాక్సిన్ను భారత్లో అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్, ఫైజర్ సంస్థలు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్నాయి. ఇవి అందించిన టీకా ప్రయోగాల సమాచారాన్ని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనేజైషన్(సీడీఎస్సీఓ) విశ్లేషిస్తోంది.
ఇవీ చదవండి..
కొత్తరకం కరోనాపై టీకా పనిచేస్తుందా?
కొత్తరకం వైరస్పై WHO ఏమందంటే..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.