రైతులను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి
అన్నదాతల ఆందోళనపై స్పందించిన మోదీ
భుజ్: నూతన వ్యవసాయ చట్టాలపై రైతులు ఉద్యమం చేస్తున్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి సాగు సంస్కరణలను సమర్థించారు. రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పిన ప్రధాని.. ప్రతిపక్షాలు అన్నదాతలను తప్పుదోవ పట్టిస్తున్నాయని దుయ్యబట్టారు. గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. కచ్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రైతు ఆందోళన, సాగు సంస్కరణలపై స్పందించారు.
‘దిల్లీ చుట్టుపక్కల ఆందోళన చేస్తున్న రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. కొత్త చట్టాలు అమలైతే మీ భూములను లాక్కుంటారని అన్నదాతలను భయపెడుతున్నారు. ఇదంతా పత్రిపక్షాల కుట్రలో భాగమే. నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే.. పాలు అమ్ముతున్నారని డైరీ యజమాని మీ పశువులను తీసుకెళ్తారా? ప్రతిపక్షాలు తమ హయాంలో ఈ సాగు సంస్కరణలకు అనుకూలంగానే ఉన్నారు. కానీ ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేకపోయాయి. ఇప్పుడు మా ప్రభుత్వం ఈ సంస్కరణలు తీసుకొస్తే వారు(విపక్షాలు) అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని ప్రతిపక్షాలపై ప్రధాని మండిపడ్డారు.
గతంలో విపక్షాలు కోరిన అంశాలనే చట్టాలుగా తీసుకొచ్చామని, రైతు సంఘాలు కూడా ఈ సంస్కరణలు తీసుకురావాలని కోరాయని మోదీ వెల్లడించారు. రైతుల సందేహాలు తీర్చేందుకు, సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. అన్నదాతల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని మోదీ హామీ ఇచ్చారు. పర్యటనలో భాగంగా మోదీ పలు వర్గాలకు చెందిన ప్రజలను కలిసి వారితో ప్రత్యేకంగా మాట్లాడారు. గుజరాత్కు చెందిన రైతులతో సాగు చట్టాలపై చర్చించారు.
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్తో హస్తిన సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా రైతులు ఆందోళన సాగిస్తున్న విషయం తెలిసిందే. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా వేలాది మంది రైతులు సరిహద్దుల్లో బైఠాయించారు. కొత్త చట్టాలను రద్దు చేసేదాకా తమ ఆందోళన విరమించబోమని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు రైతులతో మరోసారి చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కొత్త చట్టాలను అన్నదాతలు అర్థం చేసుకోవాలని, సమస్యలుంటే అందుకు అనుగుణంగా సూచనలు చేయాలని పలువురు కేంద్ర మంత్రులు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
UP: మహిళపై దాడి.. భాజపా నేతకు యోగి సర్కార్ ఝలక్..!
-
General News
Picnic: ఒక్కసారిగా వరద.. కొట్టుకుపోయిన 14 కార్లు..
-
India News
Rajinikanth: రాజకీయాల్లోకి వస్తారా? రజనీకాంత్ సమాధానమేంటంటే..?
-
Crime News
Crime news: వాటర్ బాటిల్ కోసం వివాదం.. వ్యక్తిని రైళ్లోనుంచి తోసేసిన సిబ్బంది!
-
General News
Telangana News: కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీ మార్పు
-
Movies News
Thirteen Lives review: రివ్యూ: థర్టీన్ లైవ్స్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08-08-2022)
- Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
- Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ
- Hyderabad News: కారు డ్రైవర్పై 20 మంది దాడి.. కాళ్లమీద పడినా కనికరించలే!
- China: చైనా విన్యాసాలు భస్మాసుర హస్తమే..!
- Taapsee: నా శృంగార జీవితం అంత ఆసక్తికరంగా లేదు: తాప్సి
- Crime news: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
- Weather Report: నేడు, రేపు కుంభవృష్టికి అవకాశం
- IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
- Allu Arjun: కల్యాణ్రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్