ఆ మెడికల్ డిగ్రీలు పనిచేయవు..
పాక్ ఆక్రమిత కశ్మీరు ప్రాంతంలోని వైద్య కళాశాలలు ఇచ్చే డిగ్రీలను గుర్తించబోమని భారత ప్రభుత్వం ప్రకటించింది.
పాక్కు షాకిచ్చిన భారత్
దిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలోని వైద్య కళాశాలలు ఇచ్చే డిగ్రీలను గుర్తించబోమని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ఓ అధికారిక ప్రకటన వెలువరించింది. వివరాలు ఇలా ఉన్నాయి... పీఓకేలో మెడిసిన్ చదివిన ఓ కశ్మీర్కు చెందిన ఓ విద్యార్థిని తన వైద్యవిద్యకు గుర్తింపు లభించకపోవటంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో.. ఆయా ప్రాంతాల్లో చదివే విద్యార్థులు వైద్యవిద్య ప్రాక్టీసు చేసేందుకు అనుమతించే విషయమై పునరాలోచించాలని జమ్ము కశ్మీర్ హైకోర్టు భారత ప్రభుత్వానికి గత డిసెంబర్లో సూచించింది.
ఇందుకు స్పందించిన ఎంసీఐ ‘‘జమ్ము కశ్మీర్, లద్దాఖ్లోని మొత్తం భూభాగాలు భారతదేశంలో అంతర్భాగం. పాకిస్థాన్ అక్రమంగా, దౌర్జన్యంగా ఈ భూభాగంలో కొంత ప్రాంతాన్ని ఆక్రమించింది. పాక్ ఆక్రమిత జమ్ము కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతంలోని ఏ వైద్యవిద్యా సంస్థకైనా భారత ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అయితే అక్కడున్న ఏ విద్యాసంస్థకు అనుమతి మంజూరు కాలేదు. అందువల్ల, ఆయా వైద్య కళాశాలల నుంచి పొందిన మెడికల్ డిగ్రీని పొందిన ఏ వ్యక్తికీ.. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ 1956 ప్రకారం భారత్లో ప్రాక్టీస్ చేసేందుకు అనుమతి లేదు.’’ అని స్పష్టం చేసింది.
పాక్ ప్రధాని ‘ఇమ్రాన్ ఖాన్ స్కాలర్ షిప్’ పేరిట పాక్ ప్రతి సంవత్సరం పీఓకేలోని 1600 మంది విద్యార్థులకు ఉపకార వేతనాన్ని అందిస్తోంది. అంతేకాకుండా వేర్పాటువాదుల ప్రోద్బలంతో, కశ్మీరు యువతకు తమ దేశంలో తక్కువ ఖర్చుతో విద్యనందిస్తోంది. అయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న పలువురు విద్యార్థులు వేర్పాటు వాదులుగా తయారై భారత్కు తిరిగి వస్తున్నారని భారత భద్రతా వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తాజా నిర్ణయం.. పలు సమస్యలకు చెక్ పెడుతుందని వారు హర్షం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు