కేజ్రీ ప్రభుత్వ నిర్ణయానికి ఎల్‌జీ బ్రేక్‌

అన్‌లాక్‌ 3.0కు సంబంధించి కేజ్రీవాల్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ బ్రేక్‌వేశారు. హోటళ్లు, వారపు మార్కెట్లు ప్రయోగాత్మకంగా తెరవాలని దిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అనిల్‌ బైజాల్‌ తోసిపుచ్చారు. ఇటీవల అన్‌లాక్‌ 3.0కు సంబంధించిన.......

Published : 31 Jul 2020 23:53 IST

దిల్లీ: అన్‌లాక్‌ 3.0కు సంబంధించి కేజ్రీవాల్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ బ్రేక్‌ వేశారు. హోటళ్లు, వారపు మార్కెట్లు ప్రయోగాత్మకంగా తెరవాలని దిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అనిల్‌ బైజాల్‌ తోసిపుచ్చారు. ఇటీవల అన్‌లాక్‌ 3.0కు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దిల్లీలో హోటళ్లు, వారపు మార్కెట్లు ప్రయోగాత్మకంగా తెరవాలని దిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కారణంగా కుంగిన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు సీఎం కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

దీనిపై శనివారం ఉత్తర్వులు ఇవ్వాలని దిల్లీ ప్రభుత్వం భావిస్తున్న వేళ వీటిని తెరిచేందుకు అనిల్‌ బైజాల్‌ ససేమిరా అన్నారు. ఆయన నేతృత్వంలో జరిగిన డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ సమావేశంలో వాటిని తోసిపుచ్చుతూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో దిల్లీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను ఎల్‌జీ అడ్డుకున్నారు. దీంతో ఆయన అధికార పరిధి పట్ల విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. ఈ క్రమంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని