ఇటలీలో మృత్యుఘోష: కారణాలు ఏంటంటే..!
కరోనా వైరస్ మహమ్మారి ధాటికి ఇటలీ వణకిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ విజృంభణ ఉన్నప్పటికీ కొవిడ్ కారణంగా ఎక్కువ ఇటాలియన్లే మృతి చెందుతున్నట్లు నివేదికలు స్పష్టంచేస్తున్నాయి.
రోమ్: కరోనా వైరస్ మహమ్మారి ధాటికి ఇటలీ వణకిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ విజృంభణ ఉన్నప్పటికీ కొవిడ్ కారణంగా ఎక్కువగా ఇటలీ వాసులే మృతి చెందుతున్నట్లు నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. ప్రస్తుతం యూరప్లో రెండో దఫా కరోనా విజృంభణ కొనసాగుతోన్న సమయంలోనూ ఇటలీలోనే కరోనా మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ప్రపంచంలో అత్యధిక కరోనా మరణాలు సంభవిస్తోన్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్ దేశాలు ముందున్నాయి. అనంతరం ఎక్కువ మరణాలు యూరప్లోని ఇటలీలోనే చోటుచేసుకుంటున్నాయి. నిత్యం సరాసరి 600లకు పైగా ఇటాలియన్లు కరోనా వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటివరకు ఇక్కడ 68,800మంది కొవిడ్ రోగులు మృత్యువాతపడ్డారు. ఇక అధిక మరణాలు సంభవిస్తోన్న దేశాల్లో ఇటలీ ఐదో స్థానంలో ఉండటం కలవరపెడుతోంది. అయితే, తక్కువ జనాభా ఉన్నప్పటికీ మిగతా దేశాలతో పోలిస్తే ఇక్కడే మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటానికి గల కారణాలను పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) కూడా ఇటలీ మరణాలకు గల కారణాలను విశ్లేషించింది.
ఎక్కువ మరణాలు అందుకేనా..?
అధిక జనాభా కలిగిన దేశాలతో పోలిస్తే ఇటలీలో కరోనా మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. దీనికి ఇక్కడి ప్రజల వయసే ప్రధాన కారణమని ప్రజారోగ్య నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ప్రపంచంలో వృద్ధ జనాభా ఎక్కువగా ఉండటం, వారి ఆరోగ్య సమస్యలు ఈ మరణాలకు కారణంగా విశ్లేషిస్తున్నారు. జపాన్ తర్వాత అత్యంత వృద్ధ జనాభా ఇటలీలోనే ఉంది. దాదాపు ప్రతి నలుగురు ఇటాలియన్లలో ఒకరు వయసు 65ఏళ్లకు పైబడినవారే కావడం గమనార్హం. కొవిడ్ మరణాల్లోనూ ఈ వయసు వారే ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. యూరప్లోనే అత్యంత ఎక్కువ వృద్ధ జనాభా ఇటలీలోనే ఉంది. దాదాపు 22.8శాతం ప్రజలు 65ఏళ్లకు పైబడినవారే ఉన్నారు. అంతేకాకుండా ప్రపంచంలో అత్యధిక ఆయుర్దాయం ఉన్న దేశాల్లో ఇటలీ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడి ప్రజల ఆయుర్దాయం 83సంవత్సరాలు. అయితే, జీవనకాలం ఎక్కువగా ఉన్నప్పటికీ 65ఏళ్ల వయసుపైబడిన వారిలో దాదాపు 70శాతం మందికి కనీసం రెండు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు అక్కడి ప్రభుత్వ నివేదికలు వెల్లడించాయి. వీటి కారణంగా వైరస్ బారినపడటం మరింత ఇబ్బందిగా మారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇది కూడా మరో కారణం..
కరోనా మరణాలు ఎక్కువగా ఉండటానికి వయసు ఒక కారణమైతే.. ఒకటికంటే ఎక్కువ తరాల వ్యక్తులు ఒకే కుటుంబంగా నివసిస్తుండటం కూడా మరో కారణంగా ఆరోగ్యరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండు మూడు తరాలకు చెందిన కుంటుంబ సభ్యులు ఒకేచోట ఉండటవల్ల ఆ ఇళ్లలో ఉండే యువతీ యువకులు, బంధువుల వల్ల వృద్ధులు వైరస్ బారినపడుతున్నట్లు పేర్కొంటున్నారు. కరోనా వైరస్ విజృంభణ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు మరణించిన వారిలో దాదాపు 95శాతానికి పైగా 60ఏళ్ల వయసువారే ఉన్నారు. దాదాపు 86శాతం మంది 70ఏళ్లకు పైబడిన వారు ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మరణాల్లో ఎక్కువగా ఈ వయసు వారే ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ.. ఇటలీలో వీరి సంఖ్య అధికంగా ఉంది.
రికార్డుస్థాయిలో తలసరి మరణాలు..
కరోనా మహమ్మారికి బలవుతున్న వారి సంఖ్య ఇటలీలోనే ఎక్కువగా ఉంటోంది. అధికారిక లెక్కల ప్రకారం, ఇటలీలో ప్రతి లక్ష జనాభాకు 15 కరోనా మరణాలు రికార్డవుతున్నాయి. ఇది స్పెయిన్లో 6.3, జర్మనీలో 6.9, ఫ్రాన్స్లో 8.3 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, కరోనా విజృంభించిన తొలినాళ్లలో వైరస్ తీవ్రత అధికంగానే ఉన్నప్పటికీ, వైరస్ కట్టడీకి తీసుకున్న చర్యలు, వేసవికాలం రావడంతో ఇది కాస్త అదుపులోకి వచ్చింది. కానీ, తాజాగా యూరప్లో రెండో దఫా విజృంభణ మొదలు కావడం, దీనికి తోడు శీతాకాలం కూడా జతకావడంతో ప్రస్తుతం ఇటలీలో మరోసారి కరోనా విలయతాండవం చేస్తోంది. దీంతో అప్రమత్తమైన ఇటలీ ప్రభుత్వం మళ్లీ లాక్డౌన్ ఆంక్షలను విధించింది. జనవరి 6వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొంది. ఇక ఇటలీతో పాటు వైరస్ తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో ప్రతి పదిలక్షల మందికి కరోనా మరణాలు చోటుచేసుకుంటున్న తీరు ఇలా ఉంది..
దేశం కరోనా మరణాల సంఖ్య(మిలియన్ జనాభాకు)
ఇటలీ 1076
స్పెయిన్ 1006
బ్రిటన్ 943
అమెరికా 924
మెక్సికో 886
ఫ్రాన్స్ 863
భారత్ 108
ఆరోగ్యవ్యవస్థ కూడా కారణమే..!
కేవలం కరోనా మరణాలకు వయసే కారణం కాదని..అక్కడి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకూడా మరో కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఊహించని ముప్పుగా కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించడంతో అక్కడి ఆరోగ్య వ్యవస్థపై భారం పడటం, ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత వంటి అంశాలు కొవిడ్ మరణాలు పెరుగుదలకు కారణమని యూనివర్సిటీ ఆఫ్ పదువాకు చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వైద్యుల కొరత ఉండటం, ప్రతి రోగిని జాగ్రత్తగా చూసుకోవడంలో విఫలం కావడం వల్లే ఈ సమస్య తలెత్తిందని ఆరోపిస్తున్నారు. కరోనా విజృంభిస్తోన్న సమయంలోనూ కొన్ని ప్రాంతాల్లో వైద్య పడకల కొరత తీవ్రంగా ఏర్పడిందని.. దీంతో కొవిడ్ తీవ్రత అధికంగా ఉన్న రోగులకు చికిత్స చేయడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని అంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య వ్యవస్థను నిర్లక్ష్యం చేయడం కూడా వైరస్వ్యాప్తిని కట్టడిలో విఫలమైనట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీటితో పాటు తీవ్ర అనారోగ్యానికి గురైనవారు ఆలస్యంగా ఆసుపత్రులకు రావడంతో ఒక్కోసారి పరిస్థితి చేయిదాటి పోతోందని చెబుతున్నారు. ఇటలీలో చాలా ప్రాంతాల్లో అత్యంత ఆధునిక వసతులతో కూడిన వైద్య సదుపాయాలు ఉన్నప్పటికీ సుదూర ప్రాంతాలు, కొండ ప్రాంతాల ప్రజలకు ఈ సేవలు అందడం లేదని నిపుణులు ఆవేదన వ్యక్తంచేశారు. వీటికి తోడు కరోనాను ఎదుర్కొవడంలో ముందస్తుగా సిద్ధం కాకపోవడం కూడా ఇటలీలో కరోనా తీవ్రత పెరగడానికి కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఇటలీ వ్యాప్తంగా కరోనా మరణాలు వయసుల వారీగా ఇలా ఉన్నాయి..
వయస్సు మరణాల శాతం
0-39ఏళ్లు 0.3శాతం
40-49 0.9శాతం
50-59 3.4శాతం
60-69 9.8శాతం
70-79 25శాతం
80-89 41శాతం
90ఏళ్ల పైన 19శాతం
ఇవీ చదవండి..
కొత్తరకం కరోనాపై టీకా పనిచేస్తుందా?
కొత్తరకం వైరస్పై WHO ఏమన్నదంటే..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం