‘స్వర్ణ విజయ జ్యోతి’ వెలిగించి మోదీ నివాళి
దాయాది దేశం పాక్ నడ్డివిరిచి బంగ్లాదేశ్కు స్వాతంత్ర్యం కల్పించిన భారత్ విజయానికి నేడు 50ఏళ్లు. ఈ సందర్భంగా దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద విజయ్ దివస్ 2020 వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ
దిల్లీ: దాయాది దేశం పాక్ నడ్డివిరిచి బంగ్లాదేశ్కు స్వాతంత్ర్యం కల్పించిన భారత్ విజయానికి నేడు 50ఏళ్లు. ఈ సందర్భంగా దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద విజయ్ దివస్ 2020 వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇందులో పాల్గొని 1971 నాటి యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ‘స్వర్ణ విజయ జ్యోతి’ని మోదీ వెలిగించారు. ఈ అఖండ జ్యోతులను 1971 యుద్ధం పరమ్వీర్ చక్ర, మహావీర్ చక్ర పురస్కార గ్రహీత గ్రామాలతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు తీసుకెళ్లనున్నారు.
1971లో తూర్పు పాకిస్థాన్లో స్వతంత్ర పోరు మొదలై భారత్-పాక్ మధ్య యుద్ధానికి దారితీసింది. ఇందులో పాక్ను భారత్ ఓడించింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడింది. ఆ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబరు 16న విజయ్ దివస్ నిర్వహిస్తున్నారు. బుధవారం యుద్ధ స్మారకం వద్ద నిర్వహించిన వేడుకల్లో కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. ఈ ఏడాదితో భారత్ విజయానికి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘స్వర్ణ విజయ సంవత్సరం’గా పేర్కొంటూ దేశవ్యాప్తంగా వేడుకలను నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రముఖుల నివాళులు..
విజయ్ దివస్ను పురస్కరించుకుని పలువురు ప్రముఖులు అమరవీరులకు సామాజిక మాధ్యమాల వేదికగా నివాళులర్పించారు.
* దేశ సార్వభౌమత్వాన్ని, గౌరవాన్ని రక్షించడంలో మన జవాన్లు చూపే అచంచలమైన నిబద్ధత, సైనికుల శౌర్యాన్ని మరోసారి గుర్తుచేసుకుందాం. 1971 యుద్ధంలో ప్రతి సైనికుడు పరాక్రమాన్ని ప్రదర్శించాడు. దేశం కోసం ఎంతోమంది జవాన్లు ప్రాణాలు అర్పించారు. వారి త్యాగాలకు యావత్ భారతావని శాశ్వతంగా రుణపడి ఉంటుంది - రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.
* విజయ్ దివస్ సందర్భంగా 1971 యుద్ధ వీరులకు ఘన నివాళులర్పిస్తున్నా. వారి శౌర్యపరాక్రమాలతో భారత చరిత్రలో సువర్ణ అధ్యయాన్ని లిఖించారు. ఎంతో మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నారు - ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
* భారత ఆర్మీ ధైర్యం, పరాక్రమాలకు సెల్యూట్. 1971 యుద్ధ విజయంతో మన వీర జవాన్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. వారి త్యాగాలు యావత్ భారతావనికి స్ఫూర్తిదాయకం. ప్రతి పౌరుడి గుండెల్లో చిరస్మరణీయులుగా నిలిచారు - కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434