అరిజోనాలో ట్రంప్ వర్గం ఆందోళన..!
‘ఫేక్ మీడియా’.. ఇది ట్రంప్ నోట దాదాపు ప్రతి ప్రెస్మీట్లో వినిపించే మాట. ఆయన అమెరికాలో ఫాక్స్న్యూస్, న్యూయార్క్ పోస్టులను తప్పితే మిగిలిన ప్రధాన మీడియా సంస్థలకు వ్యతిరేకంగా ఉంటారు. కానీ, ఈ సారి అధ్యక్ష ఎన్నికల ఫలితాల ప్రకటనలో ‘ఫాక్స్న్యూస్’ ట్రంప్ అభిమానులకు
ఫలితం విషయంలో గందరగోళం దేనికి..?
ఇంటర్నెట్డెస్క్: ‘ఫేక్ మీడియా’.. ఇది ట్రంప్ నోట దాదాపు ప్రతి ప్రెస్మీట్లో వినిపించే మాట. ఆయన అమెరికాలో ఫాక్స్న్యూస్, న్యూయార్క్ పోస్టులను తప్పితే మిగిలిన ప్రధాన మీడియా సంస్థలకు వ్యతిరేకంగా ఉంటారు. కానీ, ఈ సారి అధ్యక్ష ఎన్నికల ఫలితాల ప్రకటనలో ‘ఫాక్స్న్యూస్’ ట్రంప్ అభిమానులకు కోపం తెప్పించింది. వారంతా నిన్నరాత్రి అరిజోనాలోని ఫోనిక్స్ కౌంటింగ్ సెంటర్ వద్దకు చేరి ఫాక్స్ న్యూస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరిజోనా బైడెన్కు దక్కినట్లు ప్రకటించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, ఫాక్స్ న్యూస్ మాత్రం తన నిర్ణయానికి కట్టుబడి ఉంది. దీంతో ఆ వార్తాసంస్థపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
అమెరికా ఎన్నికల ఫలితాలను ప్రకటించే క్రమంలో దాదాపు 11 ఎలక్టోరల్ ఓట్ల విషయంలో గందరగోళం చెలరేగింది. అమెరికాకు చెందిన వేర్వేరు ఛానల్స్ వేర్వేరు ఆధిక్యాలను చూపిస్తున్నాయి. అక్కడ అధికారం అందించే మేజిక్ ఫిగర్ 270. ఇప్పటికే అసోసియేటెడ్ ప్రెస్, ఫాక్స్ న్యూస్ వంటి ఛానల్స్ బైడెన్ 264 ఓట్లను సాధించినట్లు చూపిస్తున్నాయి. కానీ, న్యూయార్క్ టైమ్స్, సీఎన్ఎన్, వాషింగ్టన్ పోస్టు వంటి మీడియా సంస్థలు మాత్రం 253 మాత్రమే చూపిస్తున్నాయి. దీనికో కారణం ఉంది. అమెరికన్ మీడియా సంస్థల్లో ‘డెసిషన్ డెస్క్’ అని ఒక వ్యవస్థ ఉంది. వారు కౌంటింగ్ ట్రెండ్, గణాంకాల తీరును పరిశీలించి.. విజయానికి తగిన అవకాశాలు ఉన్నచోట్ల తమ అంచనాలను ప్రకటిస్తారు. ఆయా మీడియా సంస్థలు వాటి అంచనాలను అనుసరిస్తుంటాయి. అలానే అసోసియేటెడ్ ప్రెస్ సంస్థ ఈ సారి అరిజోనా బైడెన్కు అనుకూలంగా ఉన్నట్లు పేర్కొంది. దీంతో దానిని అనుసరించే సంస్థలు 264గా పేర్కొంటున్నాయి. ఫాక్స్ న్యూస్ డెసిషన్ డెస్క్ కూడా బైడెన్కు 264 ఓట్లు వచ్చినట్లు ప్రకటించింది. ఇది ట్రంప్ వర్గం ఆగ్రహానికి కారణం అయింది. ఈ డెస్క్లోని ఆర్నోన్ మిష్కిన్ అనే డెమొక్రాటిక్ మద్దతుదారు కారణంగానే ఇలా జరిగిందని ట్రంప్ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. కానీ, ఫాక్స్ న్యూస్ తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గలేదు.
ఎన్నికల రోజు వరకు వచ్చిన అన్ని ఓట్లను లెక్కిస్తామని అరిజోనా గవర్నర్ డగ్డ్యూసి తెలిపారు. పెన్సిల్వేనియా, జార్జియాలో కౌంటింగ్ ఆపమని కోరుతున్న ట్రంప్ వర్గం.. అరిజోనాలో మాత్రం కొనసాగించాలని కోరడం గమనార్హం. ఇక్కడ ఇప్పటి వరకు 90శాతం ఓట్లు లెక్కించగా.. బైడెన్కు 50.1శాతం, ట్రంప్నకు 48.5శాతం లభించాయి.
ట్రంప్ అనుకున్నదంతా అవుతోంది..!
అమెరికా 2020: 120ఏళ్లలోనే అత్యధిక ఓటింగ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434