MCD Polls: హస్తిన.. ఆమ్ఆద్మీదేనా..! ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే..!
దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ సత్తా చాటనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మొత్తం 250 వార్డులకు గాను 150కి పైగా స్థానాలను కైవసం చేసుకోనున్నట్లు తెలిపాయి.
దిల్లీ: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ.. దేశ రాజధానిలో మాత్రం ఆమ్ఆద్మీ పార్టీ తన సత్తా చాటనున్నట్లు తెలుస్తోంది. దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో అధికార ఆమ్ఆద్మీకి ఈసారి భారీ ఆధిక్యం రానున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మొత్తం 255 వార్డులకు గాను 150కిపైగా స్థానాలు ఆప్ సొంతం చేసుకోనున్నట్లు సర్వేలు అంచనా వేశాయి. ఇక భాజపా మాత్రం 60 నుంచి 90 స్థానాలకు పరిమితం కానున్నట్లు పేర్కొన్నాయి.
దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్కు ఓట్ల శాతం కూడా భారీగా రానున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఆమ్ఆద్మీ 43శాతం ఓట్లను పొందనుండగా.. భాజపా మాత్రం 35శాతం సాధించనున్నట్లు తెలిపాయి. కాంగ్రెస్ కేవలం 10శాతానికే పరిమితం కానున్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. డిసెంబర్ 4న దిల్లీ మున్సిపల్ ఎన్నికలు జరగగా.. 7న ఓట్ల లెక్కింపు జరగనుంది. దిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఆయా సర్వేల అంచనాలు ఇలా ఉన్నాయి.
2017లో భాజపా.. ఇప్పుడు ఆప్
మరోవైపు 2017లో దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో భాజపా భారీ సీట్లను కైవసం చేసుకుంది. అప్పుడు మొత్తం 272 వార్డులుండగా (270 వార్డులకు ఎన్నికలు జరిగాయి).. అందులో 181 వార్డుల్లో భాజపా గెలిచింది. ఆమ్ఆద్మీ కేవలం 48 వార్డులకే పరిమితమయ్యింది. కాంగ్రెస్ 30వార్డుల్లో గెలవగా 11 స్థానాల్లో ఇతరులు గెలుపొందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం