Haryana: అధికారిపైనే కాదు.. రైతులపై చర్యలు తీసుకుంటాం: విజ్
నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన రైతులపై లాఠీఛార్జ్ చేసిన ఘటనపై హరియాణా హోం మంత్రి అనిల్ విజే చేసిన వ్యాఖ్యలు
కర్నాల్: నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన రైతులపై లాఠీఛార్జ్ చేసిన ఘటనపై హరియాణా హోం మంత్రి అనిల్ విజ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైయ్యాయి. ఓ వైపు లాఠీఛార్జ్కు కారణమైన ఐఏఎస్ అధికారి ఆయుష్ సిన్హాని సస్పెండ్ చేయాలని రైతులు డిమాండ్ చేస్తుంటే.. మరోవైపు ఆయన రైతులను హెచ్చరించడం గమనార్హం. ‘‘కర్నాల్లో జరిగిన ఘటనపై విచారణ కొనసాగుతోంది. దర్యాప్తు చేయకుండా ప్రభుత్వ అధికారులను శిక్షించలేము. ఒక్క ఆయుష్ సిన్హాపైనే కాదు. ఈ ఘటనలో రైతు నాయకులు దోషులుగా తేలితే వారిపైనా చర్యలు తీసుకుంటాం’’ అని హోంమంత్రి పేర్కొన్నారు.
కర్నాల్లో ఆగస్టు 28న రైతులపై పోలీసులు లాఠీఛార్జీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. పది మంది తీవ్రంగా గాయపడ్డారు. రైతుల తలలు పగలకొట్టండని పోలీసులను ఆదేశించిన అధికారిని సస్పెండ్ చేసి అతనిపై కేసు నమోదు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తోంది. ‘ఓ హంతకుడ్ని రక్షిస్తూ.. ప్రమోట్ చేయాలని ప్రభుత్వం చూస్తోంది. అతడ్ని బదిలీ చేయడం శిక్షించినట్లు ఎలా అవుతుంది?’ అని విమర్శించింది.
కాగా.. ‘కేంద్రం సాగు చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్లపై సింఘు, టిక్రి (దిల్లీ) సరిహద్దుల్లో నిరసనలు ఎప్పటికీ కొనసాగిస్తూనే ఉంటాం’ అని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయత్ అన్నారు. కర్నాల్లో నిరసన ఇప్పుడే ప్రారంభమైందని.. ఇది శాంతియుతంగా జరుగుతుందని స్వరాజ్ ఇండియా చీఫ్ యోగేంద్ర యాదవ్ తెలిపారు. రైతుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించేదాకా ఎక్కడికి వెళ్లేది లేదని భారతీయ కిసాన్ యూనియన్ నేత గురనామ్ సింగ్ చాదునీ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434