Agnipath: ‘అగ్నిపథ్’.. రక్షణశాఖకు అనవసర భారమే: వరుణ్ గాంధీ ఫైర్
త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త సర్వీసు ‘అగ్నిపథ్’ పథకంపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశానికి ముప్పు పొంచి ఉన్నవేళ.. ఈ పథకం
రాజ్నాథ్ సింగ్కు లేఖ రాసిన భాజపా ఎంపీ
బిహార్లో హింసాత్మకంగా మారిన నిరసనలు
దిల్లీ: త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త సర్వీసు ‘అగ్నిపథ్’ పథకంపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశానికి ముప్పు పొంచి ఉన్న వేళ.. ఈ పథకం సాయుధ బలగాల సామర్థ్యాన్ని బలహీనపర్చేలా ఉందని కేంద్రంపై విపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా సొంత పార్టీ నేత కూడా ‘అగ్నిపథ్’పై విమర్శలు చేశారు. ఇది రక్షణశాఖకు అనవసర భారమే అని భాజపా ఎంపీ వరుణ్ గాంధీ అన్నారు. ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు లేఖ రాశారు.
‘‘సైనిక నియామకాల్లో మార్పుల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై యువతలో అనేక ప్రశ్నలు, సందేహాలున్నాయి. నాలుగేళ్ల తర్వాత 75శాతం అగ్నివీరులు ఎలాంటి పింఛను సదుపాయం లేకుండా రిటైర్ అవుతారు. అలా రిటైర్ అయిన వారు ‘నిరుద్యోగులు’గా మిగిలిపోతారు. ఏటా ఈ నిరుద్యోగుల సంఖ్య మరింత పెరుగుతుంటుంది. ఇది యువతలో మరింత అసంతృప్తిని పెంచుతుంది. అంతేగాక, 15 ఏళ్ల తర్వాత రిటైర్ అయిన రెగ్యులర్ సైనికులను తీసుకునేందుకే కార్పొరేట్ రంగం అంతగా ఆసక్తి చూపించదు. అలాంటప్పుడు మరి వీరి పరిస్థితి ఎలా ఉంటుంది? నాలుగేళ్లు సైన్యంలో చేరితే అది వారి చదువుపై ప్రభావం చూపుతుంది. సర్వీసు పూర్తయిన తర్వాత ఉద్యోగం సాధించాలన్నా.. ఉన్నత చదువులు చదవాలన్నా వారు ఇబ్బందులు పడాల్సిందే. నాలుగేళ్ల తర్వాత కేవలం 25 శాతం మంది అగ్నివీరులు మాత్రమే సైన్యంలో కొనసాగుతారు. అంటే ఈ పథకం వల్ల సైనికుల శిక్షణ ఖర్చు వృథా అన్నట్లే కదా. ఈ పథకం రక్షణ బడ్జెట్పై అనవసర భారమే’’ అని వరుణ్ గాంధీ లేఖలో పేర్కొన్నారు.
బిహార్లో తీవ్ర ఉద్రిక్తత..
మరోవైపు అగ్నిపథ్ పథకంపై దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నాలుగేళ్ల సర్వీసు తర్వాత తమ పరిస్థితి ఏంటంటూ సైనిక నియామకాల కోసం ప్రిపేర్ అవుతున్న యువకులు రోడ్లెక్కి ఆందోళన చేపట్టారు. నిరసనకారుల ఆగ్రహజ్వాలలతో బిహార్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పలు చోట్ల ఆందోళనకారులు పోలీసు వాహనాలు, సిబ్బందిపైకి రాళ్లు విసిరారు. ఓ రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైలుకు నిప్పు పెట్టారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం