Air India: మూత్రవిసర్జన ఘటన.. సిబ్బందికి ఎయిరిండియా సీఈఓ వార్నింగ్..!
విమానాల్లో ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తిస్తే.. ఆ ఘటనలను తప్పనిసరిగా అధికారులకు ఫిర్యాదు చేయాలని ఎయిరిండియా సీఈఓ తమ సంస్థ సిబ్బందిని ఆదేశించారు. ఇటీవల ఎయిరిండియా విమానంలో మహిళపై ప్రయాణికుడు మూత్ర విసర్జన చేసిన ఘటన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
దిల్లీ: విమానంలో ఓ మహిళపై పురుష ప్రయాణికుడు మద్యం మత్తులో మూత్ర విసర్జన చేసిన ఘటన నేపథ్యంలో ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) సంస్థ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. విమానాల్లో ఇలాంటి ఘటనలు జరిగితే సిబ్బంది తప్పనిసరిగా అధికారులకు ఫిర్యాదు చేయాలని సంస్థ సీఈఓ క్యాంబెల్ విల్సన్ (Campbell Wilson) గట్టి వార్నింగ్ ఇచ్చారు.
ఈ ఘటనలో ఎయిరిండియా (Air India) సిబ్బంది తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తోన్న నేపథ్యంలో.. సంస్థ సీఈఓ విల్సన్ ఉద్యోగులకు ఇంటర్నల్ ఈమెయిల్ పంపించారు. అందులో మూత్ర విసర్జన ఘటననూ ప్రస్తావించారు. ‘‘బాధిత ప్రయాణికురాలు అనుభవించిన వేదనను అర్థం చేసుకోగలం. ఈ ఘటన నుంచి మనం కచ్చితంగా కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. అందులో అత్యంత ముఖ్యమైనది.. మన విమానాల్లో ప్రయాణికులెవరైనా అనుచిత ప్రవర్తనకు పాల్పడితే.. ఆ విషయాన్ని మనం వీలైనంత త్వరగా అధికారులకు నివేదించాలి. అలాంటి ఘటనల్లో ఇరు పక్షాలు రాజీ కుదుర్చుకున్నాయని మనకు తెలిసినప్పటికీ.. తప్పనిసరిగా ఫిర్యాదు చేయాలి. విమానాల్లో ప్రయాణికుల ప్రవర్తనా నియమావళిపై సిబ్బందికి స్పష్టమైన అవగాహన ఉండాలి. ఆ నిబంధనలు ఉల్లంఘించే ప్రయాణికులపై సమయానుకూలంగా కఠినమైన నిర్ణయం తీసుకోవాలి’’ అని సీఈఓ సిబ్బందిని సూచించారు.
నవంబరు 26న న్యూయార్క్ నుంచి దిల్లీకి వస్తున్న విమానం బిజినెస్ తరగతిలో ఓ మహిళపై ప్రయాణికుడు మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. బాధిత మహిళ టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్కు లేఖ రాయడంతో విషయం బహిర్గతమైంది. సదరు ప్రయాణికుడి గురించి తాను ఫిర్యాదు చేసినా అతడిపై విమాన సిబ్బంది ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, దీంతో విమానం దిగగానే అతడు దర్జాగా వెళ్లిపోయాడని లేఖలో ఆమె ఆరోపించారు. దీంతో ఎయిరిండియా (Air India)పై విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే, ఈ ఘటనలో ఇరు పక్షాలు రాజీకి వచ్చినందునే తాము పోలీసులకు ఫిర్యాదు చేయలేదని డీజీసీఏకు ఇచ్చిన నివేదికలో ఎయిరిండియా (Air India) వెల్లడించింది. తొలుత చర్య తీసుకోవాలని కోరిన ప్రయాణికురాలు.. ఆ తర్వాత వద్దనడంతో ఇద్దరూ రాజీ పడినట్లు భావించామని తెలిపింది. కాగా.. ఈ సమాధానంపై డీజీసీఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. సంస్థ తీరు వృత్తి ప్రమాణాలను ఉల్లంఘించేదిగా ఉందని తప్పు పట్టింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై ఎందుకు చర్య తీసుకోలేదో వివరించాలంటూ సంస్థ అధికారులకు, సంఘటన జరిగిన రోజు విమాన విధుల్లో ఉన్న సిబ్బందికి డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం