Air India: మూత్రవిసర్జన ఘటన.. సిబ్బందికి ఎయిరిండియా సీఈఓ వార్నింగ్..!
విమానాల్లో ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తిస్తే.. ఆ ఘటనలను తప్పనిసరిగా అధికారులకు ఫిర్యాదు చేయాలని ఎయిరిండియా సీఈఓ తమ సంస్థ సిబ్బందిని ఆదేశించారు. ఇటీవల ఎయిరిండియా విమానంలో మహిళపై ప్రయాణికుడు మూత్ర విసర్జన చేసిన ఘటన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
దిల్లీ: విమానంలో ఓ మహిళపై పురుష ప్రయాణికుడు మద్యం మత్తులో మూత్ర విసర్జన చేసిన ఘటన నేపథ్యంలో ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) సంస్థ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. విమానాల్లో ఇలాంటి ఘటనలు జరిగితే సిబ్బంది తప్పనిసరిగా అధికారులకు ఫిర్యాదు చేయాలని సంస్థ సీఈఓ క్యాంబెల్ విల్సన్ (Campbell Wilson) గట్టి వార్నింగ్ ఇచ్చారు.
ఈ ఘటనలో ఎయిరిండియా (Air India) సిబ్బంది తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తోన్న నేపథ్యంలో.. సంస్థ సీఈఓ విల్సన్ ఉద్యోగులకు ఇంటర్నల్ ఈమెయిల్ పంపించారు. అందులో మూత్ర విసర్జన ఘటననూ ప్రస్తావించారు. ‘‘బాధిత ప్రయాణికురాలు అనుభవించిన వేదనను అర్థం చేసుకోగలం. ఈ ఘటన నుంచి మనం కచ్చితంగా కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. అందులో అత్యంత ముఖ్యమైనది.. మన విమానాల్లో ప్రయాణికులెవరైనా అనుచిత ప్రవర్తనకు పాల్పడితే.. ఆ విషయాన్ని మనం వీలైనంత త్వరగా అధికారులకు నివేదించాలి. అలాంటి ఘటనల్లో ఇరు పక్షాలు రాజీ కుదుర్చుకున్నాయని మనకు తెలిసినప్పటికీ.. తప్పనిసరిగా ఫిర్యాదు చేయాలి. విమానాల్లో ప్రయాణికుల ప్రవర్తనా నియమావళిపై సిబ్బందికి స్పష్టమైన అవగాహన ఉండాలి. ఆ నిబంధనలు ఉల్లంఘించే ప్రయాణికులపై సమయానుకూలంగా కఠినమైన నిర్ణయం తీసుకోవాలి’’ అని సీఈఓ సిబ్బందిని సూచించారు.
నవంబరు 26న న్యూయార్క్ నుంచి దిల్లీకి వస్తున్న విమానం బిజినెస్ తరగతిలో ఓ మహిళపై ప్రయాణికుడు మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. బాధిత మహిళ టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్కు లేఖ రాయడంతో విషయం బహిర్గతమైంది. సదరు ప్రయాణికుడి గురించి తాను ఫిర్యాదు చేసినా అతడిపై విమాన సిబ్బంది ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, దీంతో విమానం దిగగానే అతడు దర్జాగా వెళ్లిపోయాడని లేఖలో ఆమె ఆరోపించారు. దీంతో ఎయిరిండియా (Air India)పై విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే, ఈ ఘటనలో ఇరు పక్షాలు రాజీకి వచ్చినందునే తాము పోలీసులకు ఫిర్యాదు చేయలేదని డీజీసీఏకు ఇచ్చిన నివేదికలో ఎయిరిండియా (Air India) వెల్లడించింది. తొలుత చర్య తీసుకోవాలని కోరిన ప్రయాణికురాలు.. ఆ తర్వాత వద్దనడంతో ఇద్దరూ రాజీ పడినట్లు భావించామని తెలిపింది. కాగా.. ఈ సమాధానంపై డీజీసీఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. సంస్థ తీరు వృత్తి ప్రమాణాలను ఉల్లంఘించేదిగా ఉందని తప్పు పట్టింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై ఎందుకు చర్య తీసుకోలేదో వివరించాలంటూ సంస్థ అధికారులకు, సంఘటన జరిగిన రోజు విమాన విధుల్లో ఉన్న సిబ్బందికి డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆస్ట్రేలియా వీసాలకు.. ఇక ‘టోఫెల్’ స్కోర్ చెల్లుబాటు
అన్ని ఆస్ట్రేలియా వీసాలకు టోఫెల్ (టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోర్ ఇక నుంచి చెల్లుబాటు అవుతుందని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ETS) వెల్లడించింది. -
‘నేనూ ఎంజాయ్ చేశా’.. తనపై వచ్చిన వీడియోను రీట్వీట్ చేసిన మోదీ
తనపై వచ్చిన ఓ మీమ్ విషయంలో ప్రధాని మోదీ (PM modi) మాత్రం చాలా హుందాగా వ్యవహరించారు. సోషల్మీడియాలో తనపై వచ్చిన ఓ వీడియో చూసి తాను ఎంజాయ్ చేసినట్లు చెప్పుకొచ్చారు. -
‘అమ్ముడుపోయే’ ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులు : హిమాచల్ సీఎం
అమ్ముడుపోయే ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులని.. పౌరుల మనోభావాలను కించపరచడమే కాకుండా ఎన్నికలపై అనవసర భారం మోపుతారని హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్సింగ్ సుఖు పేర్కొన్నారు. -
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు
కాంగ్రెస్ను వీడిన అనంతరం రాధికా ఖేడా పార్టీ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. -
హౌస్కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
ఝార్ఖండ్లో భారీ మొత్తంలో వెలుగుచూసిన నగదుపై ప్రధాని మోదీ (Modi) స్పందించారు. -
ఈ ధైర్యం పేరు జస్ప్రీత్.. వివరాలు చెప్పండి ప్లీజ్: ఆనంద్ మహీంద్రా
తల్లిదండ్రుల తోడు లేకపోయినా.. చదువుతో పాటు తన సోదరి బాధ్యతను మోస్తూ ముందుకెళ్తున్న పదేళ్ల కుర్రాడిపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. -
ఆస్ట్రేలియాలో కత్తి దాడిలో భారత విద్యార్థి మృతి
ఆస్ట్రేలియాలో ఓ భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. అతడిది హరియాణాలోని కర్నాల్ ప్రాంతం. -
‘నిన్ను చూసి గర్వపడుతున్నాం’ పూంచ్లో అమరుడైన సైనికుడి సోదరి ఆవేదన
ఉగ్ర దాడిలో శనివారం గాయాలపాలై మరణించిన భారత వైమానిక దళ(IAF) సైనికుడు కార్పోరల్ విక్కీ పహాడే మృతదేహం సోమవారం చింద్వారాలోని అతడి స్వగ్రామానికి చేరుకుంది. -
రూ.15వేల జీతగాడి ఇంట్లో రూ.25 కోట్లు.. ఎవరీ మంత్రి అలంఘీర్ ..?
అతడు రూ. 15 వేల జీతగాడు. కానీ, అతడి ఇంటిని తనిఖీ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక్కసారిగా బిత్తరపోయింది. ఓ గదిలో గుట్టలుగా పేర్చిన నగదు చూసి షాకైంది. -
రహదారిపై గుంతలకు NHAI కొత్త టెక్నిక్.. వాటంతట అవే పూడుకునేలా.!
గుంతల రహదారులకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పరిష్కారం కనుక్కోనుంది. నిర్మాణంలో కొత్త మెటీరియలను వినియోగించే అంశంపై పనిచేస్తోంది. -
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
నేడు గుజరాత్లోని పలు స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దాంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. -
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
ఒక రాష్ట్రమంత్రి సహాయకుడికి చెందిన హౌస్కీపర్ ఇంట్లో భారీ సంఖ్యలో కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. ఎన్నికల వేళ ఈ పరిణామం కలకలం సృష్టిస్తోంది. -
తప్పుడు అత్యాచారం కేసు.. మహిళకు నాలుగేళ్ల కారాగారం
తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పెట్టిన తప్పుడు కేసు కారణంగా ఓ యువకుడు సుమారు నాలుగేళ్లు జైలులో గడిపాడు. చివరకు అసలు నిజం బయటపడడంతో నాలుగు సంవత్సరాల ఆరు నెలల 13 రోజుల తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. -
నీట్ పేపర్ లీక్ కాలేదు: ఎన్టీఏ
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్ష పేపర్ లీకైనట్లు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోన్న ప్రచారాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఖండించింది. -
చిన్ననాటి బెత్తం దెబ్బలు మరవలేను: సీజేఐ
చిన్నప్పుడు పాఠశాలలో తాను బెత్తం దెబ్బలు తిన్నానని, ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
రోజుకు 80,000 మందికే శబరిమల అయ్యప్ప దర్శనం
శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఇచ్చే స్పాట్ బుకింగ్లను రద్దు చేస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం ప్రకటించింది. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్ నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు వెల్లడించింది. -
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
భారత సైన్యం మానవత్వం చాటుకుంది. విషమ పరిస్థితుల్లో ఉన్న ఓ గర్భిణిని విపత్కర వాతావరణ పరిస్థితుల నడుమ సురక్షిత ప్రదేశానికి తరలించి.. సకాలంలో చికిత్స అందేందుకు సహకరించి ఆమె ప్రాణాలను నిలబెట్టింది. -
పాఠశాలలో ఏసీ సదుపాయం ఖర్చు తల్లిదండ్రులే భరించాలి
విద్యార్థులకు పాఠశాలలో కల్పించే ఎయిర్ కండిషన్ (ఏసీ) సదుపాయం ఖర్చును వారి తల్లిదండ్రులే భరించాల్సి ఉంటుందని దిల్లీ హైకోర్టు పేర్కొంది. -
కేరళ తీర ప్రాంతాన్ని ముంచెత్తిన కెరటాలు
కేరళ తీరప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో సాగర కెరటాలు విరుచుకుపడుతున్నాయి. కొన్నిచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ఈ పోకడను ‘కళ్లక్కడళ్’ అంటారు. -
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశీయుల అరెస్టు
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశ్ పౌరులను త్రిపురలో అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు ఆదివారం తెలిపారు. వారిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు చెప్పారు. -
పూంఛ్లో కొనసాగుతున్న ఉగ్రవేట
భారతీయ వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహనశ్రేణిపై కాల్పులు జరిపి తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం సైన్యం, జమ్మూ పోలీసులు భారీస్థాయిలో గాలింపు చర్యలు ప్రారంభించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆస్ట్రేలియా వీసాలకు.. ఇక ‘టోఫెల్’ స్కోర్ చెల్లుబాటు
-
సూర్యకుమార్ యాదవ్ శతకం.. హైదరాబాద్పై ముంబయి విజయం
-
‘నేనూ ఎంజాయ్ చేశా’.. తనపై వచ్చిన వీడియోను రీట్వీట్ చేసిన మోదీ
-
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
-
ప్రైవేట్ పార్ట్కు బాల్ తగలడంతో బాలుడి మృతి
-
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు